Chiranjeevi: 'ఓజీ' సినిమాపై చిరంజీవి ప్రశంసలు
- పవన్ కల్యాణ్ 'ఓజీ' సినిమాకు బాక్సాఫీస్ వద్ద భారీ స్పందన
- చాలా సంతోషంగా ఉందన్న చిరంజీవి
- చిత్ర బృందానికి ప్రత్యేక అభినందనలు తెలిపిన మెగాస్టార్
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన తాజా చిత్రం ‘ఓజీ’ థియేటర్లలో సృష్టిస్తున్న ప్రభంజనంపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. తన తమ్ముడు సాధించిన ఈ ఘన విజయం పట్ల ఆయన ఆనందం వ్యక్తం చేస్తూ ట్విట్టర్ వేదికగా చిత్ర బృందానికి అభినందనలు తెలిపారు. పవన్ కల్యాణ్ను అభిమానులు ‘ది ఓజీ – ఓజాస్ గంభీరా’గా సంబరాలు చేసుకుంటుండటం చూస్తుంటే తనకు చాలా సంతోషంగా ఉందని చిరంజీవి పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ‘ఓజీ’ చిత్ర బృందాన్ని ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు. ఈ సినిమాకు అద్భుతమైన కథను అందించిన దర్శకుడు సుజీత్ను, భారీ బడ్జెట్తో చిత్రాన్ని నిర్మించిన నిర్మాత డీవీవీ దానయ్యను, తన సంగీతంతో సినిమాకు ప్రాణం పోసిన తమన్ను ఆయన అభినందించారు. “పవన్, సుజీత్, డీవీవీ దానయ్య, తమన్ మరియు మొత్తం టీమ్కు హృదయపూర్వక అభినందనలు” అని తెలిపారు.
మరోవైపు, ‘ఓజీ’ చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయి వసూళ్లతో దూసుకుపోతోంది. విడుదలైన మొదటి షో నుంచే సినిమాకు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తోంది. యాక్షన్, ఎమోషన్స్ కలగలిపి పవన్ అభిమానులకు ఒక పండగలా ఈ సినిమా ఉందని సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి స్వయంగా స్పందించి అభినందనలు తెలపడం చిత్ర యూనిట్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది.
ఈ సందర్భంగా ‘ఓజీ’ చిత్ర బృందాన్ని ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు. ఈ సినిమాకు అద్భుతమైన కథను అందించిన దర్శకుడు సుజీత్ను, భారీ బడ్జెట్తో చిత్రాన్ని నిర్మించిన నిర్మాత డీవీవీ దానయ్యను, తన సంగీతంతో సినిమాకు ప్రాణం పోసిన తమన్ను ఆయన అభినందించారు. “పవన్, సుజీత్, డీవీవీ దానయ్య, తమన్ మరియు మొత్తం టీమ్కు హృదయపూర్వక అభినందనలు” అని తెలిపారు.
మరోవైపు, ‘ఓజీ’ చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయి వసూళ్లతో దూసుకుపోతోంది. విడుదలైన మొదటి షో నుంచే సినిమాకు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తోంది. యాక్షన్, ఎమోషన్స్ కలగలిపి పవన్ అభిమానులకు ఒక పండగలా ఈ సినిమా ఉందని సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి స్వయంగా స్పందించి అభినందనలు తెలపడం చిత్ర యూనిట్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది.