సొంత ప్రజలను చంపడం అయిపోతే ఇక ఆర్థిక వ్యవస్థపై దృష్టి పెట్టండి.. పాక్ కు భారత్ హితవు
- ఐరాస మానవ హక్కుల వేదికపై పాక్ తీరును ఎండగట్టిన వైనం
- ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తూ సొంత ప్రజలపైనే బాంబులు వేస్తోందని ఫైర్
- మాపై నిరాధార ఆరోపణలు మాని వెంటిలేటర్ పై ఉన్న ఆర్థిక వ్యవస్థను కాపాడుకోవాలంటూ ఎద్దేవా
భారత్ పై నిరాధార ఆరోపణలు చేస్తూ నిత్యం రెచ్చగొట్టడమే పాకిస్థాన్ పనిగా పెట్టుకుందని ఆయన ఆరోపించారు. ఓవైపు దేశంలో ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంగా మారి మరణశయ్యపైకి చేరినా పాక్ ఉగ్రవాద కార్యకలాపాలను ఆపడంలేదని విమర్శించారు. ఇప్పటికైనా నిరాధార ఆరోపణలు మాని వెంటిలేటర్ పై ఉన్న ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దుకునే ప్రయత్నం చేయాలంటూ పాక్ కు హితవు పలికారు.