ఏపీ మెగా డీఎస్సీలో టీచర్ గా ఎంపికైన సైనికురాలు
––
పంజాబ్లో శిక్షణ పూర్తి చేసుకుని ప్రస్తుతం జమ్మూ కశ్మీర్లో విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే, ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా స్థిరపడాలనే లక్ష్యాన్ని రోజా వీడలేదు. ఓవైపు సరిహద్దుల్లో సేవలందిస్తూనే ఖాళీ సమయాల్లో డీఎస్సీకి సిద్దమయ్యారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించిన మెగా డీఎస్సీలో రోజా అనుకున్నది సాధించారు.