Chandrababu Naidu: నేడు విశాఖకు సీఎం చంద్రబాబు

Chandrababu Naidu to Visit Visakhapatnam Today
షార్ట్స్‌లో చూడండి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు విశాఖపట్టణంలో పర్యటించనున్నారు. ఆయన ఉదయం 11:35 గంటలకు విశాఖపట్నం చేరుకుంటారు. అనంతరం మహిళా ఆరోగ్య పరిరక్షణకు సంబంధించిన 'స్వస్థ్ నారీ - సశక్త్ పరివార్ అభియాన్' పేరుతో నిర్వహించే పలు కార్యక్రమాలలో ముఖ్యమంత్రి పాల్గొంటారు.

ఆంధ్ర విశ్వవిద్యాలయంలోని సాగరికా ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన హెల్త్ క్యాంపులను ముఖ్యమంత్రి సందర్శిస్తారు. ఆ తరువాత మధ్యాహ్నం 12 గంటలకు ఆంధ్ర విశ్వవిద్యాలయం కన్వెన్షన్ సెంటర్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్‌గా ప్రారంభించనున్న 'స్వస్థ్ నారీ - సశక్త్ పరివార్ అభియాన్' సభలో ముఖ్యమంత్రి పాల్గొని ప్రసంగిస్తారు.

అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు రాడిసన్ బ్లూ హోటల్‌లో గ్లోబల్ కేపబులిటీ సెంటర్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న బిజినెస్ సమ్మిట్‌లో ముఖ్యమంత్రి పాల్గొంటారు. అక్కడే నెదర్లాండ్స్, ఫ్రెంచ్ దేశాలకు చెందిన ప్రతినిధుల బృందంతో చంద్రబాబు నాయుడు విడివిడిగా సమావేశమవుతారు. రాత్రి 7:40 గంటలకు విశాఖపట్నం పర్యటన ముగించుకుని ముఖ్యమంత్రి అమరావతికి బయలుదేరతారు. 
Go Back to Shorts
Chandrababu Naidu
Andhra Pradesh
Visakhapatnam
Swasth Nari Sashakt Parivar Abhiyan
Andhra University
Health Camp
Global Capability Center
Business Summit
Netherlands
French Delegation

More Telugu News