రోజుకు లక్ష మంది రాకపోకలు... తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్ నిర్మించాలి: సీఎం చంద్రబాబు
- తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్ నిర్మాణానికి సన్నాహాలు
- రోజుకు లక్ష మంది ప్రయాణికుల సామర్థ్యంతో నిర్మాణం
- హెలిప్యాడ్, మాల్స్, మల్టీప్లెక్స్లతో కూడిన డిజైన్లు
- భవిష్యత్ అవసరాల కోసం ప్రతి బస్సుకు ఈవీ చార్జింగ్ సౌకర్యం
- బస్ స్టేషన్ నమూనాలను పరిశీలించి అధికారులకు సీఎం సూచనలు
- రాష్ట్రంలోని అన్ని బస్ స్టేషన్లను ఆధునీకరించాలని ఆదేశం
రెండు బస్ ఎంట్రీలు, ఎగ్జిట్ వేలు 2 ఏర్పాటు చేయాలని, సోలార్ రూఫ్ టాప్తో సొంత విద్యుత్ అవసరాలు తీర్చుకునేలా చూడాలన్నారు. మొత్తం 13 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించ తలపెట్టిన ఈ బస్ స్టేషన్ కనీసం లక్ష మంది నిత్యం రాకపోకలు సాగించేందుకు వీలుగా నిర్మాణం చేయాలన్నారు.
భవిష్యత్లో అన్నీ ఎలక్ట్రిక్ బస్సులే నడపనున్న నేపథ్యంలో ప్రతీ బస్సుకు చార్జింగ్ సౌకర్యం ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చెప్పారు. దీనికి సంబంధించి మొత్తం 5 మోడల్స్ను ముఖ్యమంత్రి పరిశీలించారు. వాటిని మరింత అభివృద్ధి చేయాలన్నారు. దీనికోసం స్టేక్ హోల్డర్లతో సమావేశం నిర్వహించాలన్నారు. అలాగే రాష్ట్రంలో అన్ని బస్ స్టేషన్లు ఆధునీకరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని సీఎం సూచనలు చేశారు.