AP Politics: ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం.. వైసీపీ నేత ముద్రగడతో మాజీ ఎమ్మెల్యే వర్మ భేటీ

Mudragada Padmanabham Met by Former MLA Varma Sparks AP Political Interest
షార్ట్స్‌లో చూడండి
ఏపీ రాజకీయాల్లో ఒక ఆసక్తికరమైన పరిణామం చోటుచేసుకుంది. పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్.వి.ఎస్.ఎన్. వర్మ, వైసీపీ సీనియర్ నేత ముద్రగడ పద్మనాభంతో భేటీ కావడం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ముద్రగడ నివాసానికి స్వయంగా వెళ్లిన వర్మ, ఆయనతో కాసేపు ముచ్చటించారు. ఈ ఇద్దరు నేతల మధ్య జరిగిన సంభాషణ ఏంటనే దానిపై రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

ఇటీవల ముద్రగడ పద్మనాభం అనారోగ్యంతో బాధపడిన సంగతి తెలిసిందే. కాకినాడలో ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం ఆయన్ను హైదరాబాద్‌కు తరలించారు. అక్కడ చికిత్స తీసుకుని పూర్తిగా కోలుకున్న తర్వాత ఆయన ఇటీవలే ఇంటికి తిరిగి వచ్చారు. ఈ నేపథ్యంలో ముద్రగడ ఆరోగ్యం గురించి వాకబు చేసేందుకే వర్మ ఆయన ఇంటికి వెళ్లారని, ఇది కేవలం మర్యాదపూర్వక భేటీ మాత్రమేనని ఒక వాదన వినిపిస్తోంది.

అయితే, ఈ కలయికకు రాజకీయ ప్రాధాన్యం కూడా ఉందని పలువురు విశ్లేషిస్తున్నారు. వీరి భేటీ వెనుక ఉన్న అసలు కారణాలపై భిన్నమైన ఊహాగానాలు మొదలయ్యాయి. ఇప్పటివరకు ఈ భేటీపై వర్మ ఎలాంటి అధికారిక ప్రకటన చేయకపోవడం ఈ చర్చకు మరింత బలాన్నిస్తోంది. ప్రస్తుతం వీరిద్దరూ మాట్లాడుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. ఈ కలయిక కేవలం పరామర్శకే పరిమితమా? లేక దీని వెనుక ఏదైనా రాజకీయ వ్యూహం ఉందా? అనేది తేలాల్సి ఉంది.
Go Back to Shorts
AP Politics
Mudragada Padmanabham
SVSN Varma
Andhra Pradesh
Pithapuram
YSRCP
Former MLA
Political Meeting
Andhra Pradesh
Kakinada
Political Strategy

More Telugu News