Donald Trump: నా మిత్రుడు మోదీతో త్వరలో మాట్లాడతా: వాణిజ్య వివాదాలపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు

Will Speak To PM Modi In Upcoming Weeks Says Trump Amid Tariff Row
షార్ట్స్‌లో చూడండి
భారత్, అమెరికా మధ్య నిలిచిపోయిన వాణిజ్య చర్చలు మళ్లీ పట్టాలెక్కనున్నాయి. ఇరు దేశాల మధ్య ఉన్న వాణిజ్య అవరోధాలను తొలగించేందుకు చర్చలను పునఃప్రారంభించనున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మంగళవారం ప్రకటించారు. ఈ చర్చలు ఇరు దేశాలకు ప్రయోజనకరంగా ముగుస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ మేరకు తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ట్రూత్ సోషల్'లో ఆయన ఒక పోస్ట్ చేశారు. "భారత్, అమెరికా మధ్య ఉన్న వాణిజ్య అవరోధాలను పరిష్కరించేందుకు చర్చలు కొనసాగుతున్నాయని చెప్పడానికి సంతోషిస్తున్నాను. రాబోయే వారాల్లో నా మంచి మిత్రుడు, ప్రధాని మోదీతో మాట్లాడాలని ఎదురుచూస్తున్నాను. ఇరు దేశాలకు మేలు చేసేలా ఒక విజయవంతమైన ముగింపు వస్తుందన్న నమ్మకం నాకుంది" అని ట్రంప్ తన పోస్ట్‌లో పేర్కొన్నారు.

అయితే, కొద్ది రోజుల క్రితం వైట్‌హౌస్‌లో మాట్లాడుతూ ట్రంప్ కాస్త భిన్నమైన వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ప్రధాని మోదీ తనకు ఎప్పటికీ మిత్రుడేనని, భారత్-అమెరికా సంబంధాలు చాలా ప్రత్యేకమైనవని చెబుతూనే.. "ప్రస్తుత సమయంలో ఆయన (మోదీ) చేస్తున్నది నాకు నచ్చడం లేదు" అని వ్యాఖ్యానించారు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అప్పుడప్పుడు ఇలాంటివి జరుగుతుంటాయని అన్నారు. ఇటీవల భారత వస్తువులపై అమెరికా 50 శాతం వరకు సుంకాలు విధించిన నేపథ్యంలో ఈ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. రష్యా నుంచి చమురు కొనుగోలుపై అదనంగా 25 శాతం జరిమానా కూడా విధించింది.

ట్రంప్ వ్యాఖ్యలపై ప్రధాని మోదీ కూడా గత శనివారం సానుకూలంగా స్పందించారు. ట్రంప్ అభిప్రాయాలను తాను పూర్తిగా అభినందిస్తున్నానని, ఏకీభవిస్తున్నానని తెలిపారు. భారత్-అమెరికా సంబంధాలు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ముందుకు సాగుతున్నాయని, ఇది ఒక 'సమగ్ర ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యం' అని మోదీ తన 'ఎక్స్' (గతంలో ట్విట్టర్) పోస్ట్‌లో పేర్కొన్నారు.
Go Back to Shorts
Donald Trump
India US trade
Narendra Modi
trade negotiations
US tariffs on India
India America relations
Truth Social
India Russia oil
US trade policy
economic partnership

More Telugu News