Mallu Bhatti Vikramarka: అందరం కలిసికట్టుగా పని చేసి రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయాలి: మల్లు భట్టివిక్రమార్క
- రాహుల్ గాంధీ ప్రధాని కావడం దేశానికి చాలా అవసరమని వ్యాఖ్య
- పని చేసిన ప్రతి కార్యకర్తకు పార్టీ లేదా ప్రభుత్వంలో ఏదో పదవి ఇస్తామని హామీ
- మహేశ్ కుమార్ గౌడ్ చేపట్టే ప్రతి పనికి సీఎం, మంత్రివర్గం అండగా ఉంటుందని వెల్లడి
రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావడం దేశానికి ఎంతో అవసరమని తెలంగాణ ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క అభిప్రాయపడ్డారు. హైదరాబాద్లోని గాంధీ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేసేందుకు ఐక్యంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఎన్నికలకు ముందు శ్రమించిన ప్రతి కార్యకర్తకు పార్టీ లేదా ప్రభుత్వ పదవిలో ఏదో ఒక అవకాశం తప్పకుండా లభిస్తుందని ఆయన హామీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీని తిరుగులేని శక్తిగా నిలిపేందుకు పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ చేపట్టిన ప్రతి కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రివర్గం సంపూర్ణ మద్దతు తెలుపుతుందని ఆయన స్పష్టం చేశారు.
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ఈ విషయంలో ఎదురయ్యే సవాళ్లను అధిగమించి న్యాయం చేకూరుస్తామని ఆయన అన్నారు. 42 శాతం రిజర్వేషన్ బిల్లును బీజేపీ రాష్ట్రపతి వద్ద నిలిపివేసిందని ఆయన ఆరోపించారు. ఈ వ్యవహారంలో బీజేపీ, బీఆర్ఎస్ కుట్ర దాగి ఉందని ఆయన వ్యాఖ్యానించారు.
ఎన్నికలకు ముందు శ్రమించిన ప్రతి కార్యకర్తకు పార్టీ లేదా ప్రభుత్వ పదవిలో ఏదో ఒక అవకాశం తప్పకుండా లభిస్తుందని ఆయన హామీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీని తిరుగులేని శక్తిగా నిలిపేందుకు పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ చేపట్టిన ప్రతి కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రివర్గం సంపూర్ణ మద్దతు తెలుపుతుందని ఆయన స్పష్టం చేశారు.
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ఈ విషయంలో ఎదురయ్యే సవాళ్లను అధిగమించి న్యాయం చేకూరుస్తామని ఆయన అన్నారు. 42 శాతం రిజర్వేషన్ బిల్లును బీజేపీ రాష్ట్రపతి వద్ద నిలిపివేసిందని ఆయన ఆరోపించారు. ఈ వ్యవహారంలో బీజేపీ, బీఆర్ఎస్ కుట్ర దాగి ఉందని ఆయన వ్యాఖ్యానించారు.