Soubin Shahir: 'కూలీ' సినిమా ఫేం షౌబిన్ షాహిర్కు ఎర్నాకులం కోర్టు షాక్
- సైమా అవార్డ్స్ కోసం దుబాయ్ వెళ్లేందుకు అనుమతి నిరాకరణ
- సినిమా లాభాల్లో వాటా ఇవ్వలేదని చీటింగ్ కేసు నమోదు
- రూ. 7 కోట్లు పెట్టుబడి పెట్టిన వ్యక్తి నుంచి ఫిర్యాదు
- విచారణను ప్రభావితం చేసే అవకాశం ఉందని ప్రాసిక్యూషన్ వాదన
‘మంజుమ్మల్ బాయ్స్’ చిత్రంతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన మలయాళ నటుడు, 'కూలీ' సినిమా ఫేం షౌబిన్ షాహిర్కు కోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. చీటింగ్ కేసులో విచారణ ఎదుర్కొంటున్న ఆయన, దుబాయ్లో జరిగే సైమా అవార్డుల వేడుకకు వెళ్లేందుకు అనుమతి కోరగా... ఎర్నాకులం కోర్టు ఆ అభ్యర్థనను తిరస్కరించింది.
వివరాల్లోకి వెళితే.. సెప్టెంబర్ 5, 6 తేదీల్లో దుబాయ్లో జరగనున్న సైమా అవార్డుల కార్యక్రమానికి హాజరయ్యేందుకు తనను అనుమతించాలని షౌబిన్ కోర్టును ఆశ్రయించారు. అయితే, ఈ కేసు విచారణ ఇంకా కొనసాగుతోందని, కేసులో కీలక సాక్షి ఒకరు దుబాయ్లోనే ఉన్నారని ప్రాసిక్యూషన్ కోర్టు దృష్టికి తీసుకెళ్లింది. షౌబిన్ విదేశాలకు వెళితే సాక్షిని ప్రభావితం చేసే ప్రమాదం ఉందని వాదించింది. ఈ వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం, ఆయన విదేశీ పర్యటనకు అనుమతి నిరాకరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
‘మంజుమ్మల్ బాయ్స్’ సినిమా నిర్మాణ వ్యవహారంలోనే షౌబిన్ ఈ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ చిత్రానికి ఆయన తన తండ్రి, మరో వ్యక్తితో కలిసి నిర్మాతగా వ్యవహరించారు. సిరాజ్ అనే వ్యక్తి ఈ సినిమా కోసం రూ. 7 కోట్లు పెట్టుబడిగా పెట్టారని, సినిమా విడుదలై లాభాలు వచ్చాక అందులో 40 శాతం వాటా ఇస్తామని నిర్మాతలు హామీ ఇచ్చారని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. సినిమా బ్లాక్బస్టర్ విజయం సాధించినా, తనకు రావాల్సిన వాటా ఇవ్వకుండా మోసం చేశారని సిరాజ్ ఆరోపించారు. ఈ ఫిర్యాదు ఆధారంగా ఎర్నాకులం పోలీసులు షౌబిన్తో పాటు ఇతరులపై చీటింగ్ కేసు నమోదు చేశారు.
ప్రస్తుతం ఈ కేసులో షౌబిన్ మధ్యంతర బెయిల్పై ఉండగా, విచారణ కొనసాగుతోంది. తాజా కోర్టు ఆదేశాలతో ఆయన సైమా అవార్డుల వేడుకకు దూరమైనట్లేనని తెలుస్తోంది.
వివరాల్లోకి వెళితే.. సెప్టెంబర్ 5, 6 తేదీల్లో దుబాయ్లో జరగనున్న సైమా అవార్డుల కార్యక్రమానికి హాజరయ్యేందుకు తనను అనుమతించాలని షౌబిన్ కోర్టును ఆశ్రయించారు. అయితే, ఈ కేసు విచారణ ఇంకా కొనసాగుతోందని, కేసులో కీలక సాక్షి ఒకరు దుబాయ్లోనే ఉన్నారని ప్రాసిక్యూషన్ కోర్టు దృష్టికి తీసుకెళ్లింది. షౌబిన్ విదేశాలకు వెళితే సాక్షిని ప్రభావితం చేసే ప్రమాదం ఉందని వాదించింది. ఈ వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం, ఆయన విదేశీ పర్యటనకు అనుమతి నిరాకరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
‘మంజుమ్మల్ బాయ్స్’ సినిమా నిర్మాణ వ్యవహారంలోనే షౌబిన్ ఈ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ చిత్రానికి ఆయన తన తండ్రి, మరో వ్యక్తితో కలిసి నిర్మాతగా వ్యవహరించారు. సిరాజ్ అనే వ్యక్తి ఈ సినిమా కోసం రూ. 7 కోట్లు పెట్టుబడిగా పెట్టారని, సినిమా విడుదలై లాభాలు వచ్చాక అందులో 40 శాతం వాటా ఇస్తామని నిర్మాతలు హామీ ఇచ్చారని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. సినిమా బ్లాక్బస్టర్ విజయం సాధించినా, తనకు రావాల్సిన వాటా ఇవ్వకుండా మోసం చేశారని సిరాజ్ ఆరోపించారు. ఈ ఫిర్యాదు ఆధారంగా ఎర్నాకులం పోలీసులు షౌబిన్తో పాటు ఇతరులపై చీటింగ్ కేసు నమోదు చేశారు.
ప్రస్తుతం ఈ కేసులో షౌబిన్ మధ్యంతర బెయిల్పై ఉండగా, విచారణ కొనసాగుతోంది. తాజా కోర్టు ఆదేశాలతో ఆయన సైమా అవార్డుల వేడుకకు దూరమైనట్లేనని తెలుస్తోంది.