'కన్నప్ప' ఓటీటీ విడుదలకు ముహూర్తం ఫిక్స్
- అమెజాన్ ప్రైమ్లోకి మంచు విష్ణు 'కన్నప్ప'
- సెప్టెంబర్ 4 నుంచి స్ట్రీమింగ్
- సోషల్ మీడియా ద్వారా ప్రకటించిన మంచు విష్ణు
ఈ ఏడాది జూన్ 27న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకుంది. ముఖేశ్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను అవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై నిర్మించారు. పరమ శివభక్తుడైన కన్నప్ప కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. నాస్తికుడైన తిన్నడు అనే గిరిజన యువకుడు, మహా భక్తుడైన కన్నప్పగా ఎలా పరిణితి చెందాడనే ఆసక్తికరమైన కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందించారు.
ఈ చిత్రంలో కేవలం మంచు విష్ణు మాత్రమే కాకుండా భారతీయ సినిమా పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖ నటులు కీలక పాత్రల్లో కనిపించారు. ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్, శరత్ కుమార్, మోహన్ బాబు, బ్రహ్మానందం, కాజల్ అగర్వాల్ వంటి భారీ తారాగణం ఈ సినిమాలో నటించడం విశేషం. థియేటర్లలో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న ఈ చిత్రం, ఇప్పుడు ఓటీటీ ద్వారా మరింత మందికి చేరువ కానుంది.