ఏపీ ఇంటర్ పరీక్షల విధానంలో భారీ మార్పులు.. నెల ముందుగానే షెడ్యూల్
- ఇంటర్ పబ్లిక్ పరీక్షలు ఈసారి మార్చికి బదులు ఫిబ్రవరిలోనే
- సీబీఎస్ఈ విధానానికి అనుగుణంగా షెడ్యూల్లో మార్పు
- రోజుకు ఒకే సబ్జెక్టు పరీక్ష.. విద్యార్థులపై ఒత్తిడి తగ్గించే యోచన
- మొదట సైన్స్ సబ్జెక్టులు, చివర్లో భాషా, ఆర్ట్స్ పరీక్షల నిర్వహణ
- ప్రథమ సంవత్సరంలో పూర్తిగా ఎన్సీఈఆర్టీ సిలబస్ అమలు
- ప్రశ్నపత్రాల విధానంలోనూ పలు కీలక సంస్కరణలు
ముఖ్యంగా ఈ ఏడాది కొత్తగా 'ఎంబైపీసీ' గ్రూపును ప్రవేశపెట్టడంతో పాటు విద్యార్థులు తమకు నచ్చిన సబ్జెక్టులను ఎంచుకునే వెసులుబాటు కల్పించారు. దీనివల్ల ఒకే విద్యార్థికి వేర్వేరు గ్రూపుల సబ్జెక్టులు ఉండే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఒకే రోజు రెండు పరీక్షలు రాయడం సాధ్యం కాదు కాబట్టే రోజుకు ఒకే పరీక్ష విధానాన్ని తీసుకొచ్చారు.
ఈ విద్యా సంవత్సరం నుంచి ఇంటర్ ప్రథమ సంవత్సరంలో పలు సంస్కరణలను కూడా అమలు చేస్తున్నారు. సిలబస్ను పూర్తిగా ఎన్సీఈఆర్టీకి అనుగుణంగా మార్చారు. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ సబ్జెక్టులకు 85 మార్కులకు రాతపరీక్ష నిర్వహించి, మిగతా మార్కులను రెండో ఏడాది ప్రాక్టికల్స్కు కేటాయించనున్నారు. బయాలజీలో వృక్షశాస్త్రానికి 43, జంతుశాస్త్రానికి 42 మార్కులు ఉంటాయి. అన్ని పేపర్లలోనూ కొత్తగా ఒక మార్కు ప్రశ్నలను చేర్చారు. అయితే, ప్రాక్టికల్ పరీక్షలను థియరీ పరీక్షలకు ముందు జనవరి చివర్లో నిర్వహించాలా లేక థియరీ పరీక్షల తర్వాత పెట్టాలా అనే అంశంపై ఇంకా తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.