పవన్ కల్యాణ్ ను కలిసిన ఆసియా కప్ టీమిండియా మేనేజర్
- ఆసియా కప్కు టీమిండియా మేనేజర్గా ప్రశాంత్ నియామకం
- విశాఖలో పవన్ ను కలిసిన ప్రశాంత్
- భీమవరం జనసేన ఎమ్మెల్యే అంజిబాబు కుమారుడే ప్రశాంత్
సెప్టెంబర్ 9వ తేదీ నుంచి దుబాయ్, అబుదాబి వేదికలుగా ఆసియా కప్ పోటీలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ నియామకం జరిగింది. భీమవరం జనసేన ఎమ్మెల్యే, పీఏసీ ఛైర్మన్ అయిన పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు) కుమారుడే ప్రశాంత్ కావడం విశేషం. అంతేకాకుండా, భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుకు ప్రశాంత్ అల్లుడు కూడా.
గతంలో ప్రశాంత్ క్రీడా రంగంలో పలు బాధ్యతలు నిర్వర్తించారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా తరఫున క్రికెటర్గా ప్రాతినిధ్యం వహించడంతో పాటు ఆంధ్ర క్రికెట్ సంఘం (ఏసీఏ) ఉపాధ్యక్షుడిగా కూడా పనిచేశారు. ఇప్పుడు జాతీయ జట్టుకు మేనేజర్గా ఎంపికవడం ద్వారా ఆయన తన కెరీర్లో మరో మైలురాయిని చేరుకున్నారు.