అసెంబ్లీకి రాకపోతే తప్పు ఒప్పుకున్నట్టే: కేసీఆర్పై మంత్రి కోమటిరెడ్డి ఫైర్
- కాళేశ్వరం నివేదికపై చర్చకు కేసీఆర్ రావాలన్న మంత్రి కోమటిరెడ్డి
- సభకు హాజరుకాకపోతే తప్పును అంగీకరించినట్లేనని వ్యాఖ్య
- రేపటి నుంచి అసెంబ్లీలో కాళేశ్వరంపై చర్చ జరగనున్నట్లు వెల్లడి
కాళేశ్వరం అంశంలో తప్పు జరిగింది కాబట్టే కేసీఆర్ భయపడుతున్నారని కోమటిరెడ్డి ఎద్దేవా చేశారు. ఆ భయంతోనే ఆయన న్యాయస్థానాన్ని ఆశ్రయించారని ఆరోపించారు. "అసెంబ్లీకి రావాల్సిందే.. తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాల్సిందే" అని ఆయన స్పష్టం చేశారు. కేసీఆర్ సభకు వచ్చి చర్చలో పాల్గొని, ప్రభుత్వ ఆరోపణలకు జవాబివ్వాలని సవాల్ విసిరారు.
మరోవైపు, తెలంగాణ శాసనసభ సమావేశాల్లో భాగంగా దివంగత జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతి పట్ల సంతాప తీర్మానాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా, గోపీనాథ్ విద్యార్థి దశ నుంచే రాజకీయాల్లో చురుగ్గా ఉండేవారని ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు. అదేవిధంగా, శాసనమండలిలో మాజీ ఎమ్మెల్సీలు రత్నాకర్, రంగారెడ్డి మృతి పట్ల సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టి నివాళులర్పించారు.