బీహార్ ఓటర్ లిస్ట్ లో ఆఫ్ఘన్, బంగ్లా వాసుల పేర్లు.. 3 లక్షల మందికి ఈసీ నోటీసులు
- నేపాల్, మయన్మార్ వాసులకూ బీహార్ లో ఓటు హక్కు
- ఓటర్ లిస్ట్ లో అవకతవకలపై ఈసీ సర్వేలో షాకింగ్ విషయాల వెల్లడి
- సవరించిన జాబితాను సెప్టెంబర్ 30 న ప్రకటిస్తామన్న ఈసీ
ఈ సర్వేలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయని తెలిపింది. మన దేశానికి పొరుగున ఉన్న నేపాల్, మయన్మార్, బంగ్లాదేశ్ లతో పాటు ఆఫ్ఘనిస్థాన్ వాసులు పలువురు ఓటు హక్కు పొందారని తేలినట్లు వెల్లడించింది. అనర్హులుగా గుర్తించిన సుమారు 3 లక్షల మంది ఓటర్లకు నోటీసులు పంపినట్లు తెలిపింది. వారి గుర్తింపు పత్రాలను పరిశీలించిన తర్వాత అర్హుల పేర్లను కొనసాగిస్తూ అనర్హుల పేర్లను తొలగిస్తామని, సవరించిన ఓటర్ జాబితాను సెప్టెంబర్ 30న విడుదల చేస్తామని ఎన్నికల సంఘం పేర్కొంది.