వినాయక చవితి ఎఫెక్ట్.. తిరుమలలో దర్శనానికి ఎంత సమయం పడుతోందంటే..!
- వినాయక చవితితో తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ
- 12 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న సర్వదర్శనం భక్తులు
- రూ. 300 టోకెన్ ఉన్నవారికి గంట నుంచి 3 గంటల్లో దర్శనం
ప్రస్తుతం శ్రీవారి సర్వదర్శనం కోసం 12 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. ఎలాంటి టోకెన్లు లేని భక్తులకు స్వామివారి దర్శనానికి దాదాపు 10 గంటల సమయం పడుతుందని టీటీడీ పేర్కొంది. అదేవిధంగా, సర్వదర్శనం టోకెన్లు ఉన్నవారికి 3 నుంచి 5 గంటలు, రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కొనుగోలు చేసిన భక్తులకు గంట నుంచి మూడు గంటల వ్యవధిలో దర్శనం పూర్తవుతుందని అధికారులు వెల్లడించారు.
ఇక నిన్న శ్రీవారిని 77,837 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 21,510 మంది తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులు సమర్పించిన కానుకల ద్వారా శ్రీవారి హుండీకి రూ. 3.49 కోట్ల ఆదాయం లభించినట్లు టీటీడీ ఓ ప్రకటనలో తెలిపింది.