Sanjay Patel: పెళ్లి చేసుకోమందని ప్రియురాలిని 7 ముక్కలు చేసిన మాజీ సర్పంచ్!
- మాజీ సర్పంచ్, అతని మేనల్లుడిని అరెస్ట్ చేసిన పోలీసులు
- పోస్టర్ ద్వారా మృతురాలిని గుర్తించిన కుటుంబసభ్యులు
- పరారీలో ఉన్న మరో నిందితుడిపై రూ. 25,000 రివార్డు
ఉత్తరప్రదేశ్లోని ఝాన్సీ జిల్లాలో అత్యంత దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేస్తోందన్న కారణంతో ఓ మాజీ సర్పంచ్ తన ప్రియురాలిని కిరాతకంగా హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని ఏడు ముక్కలుగా నరికి, సంచుల్లో కుక్కి బావిలో పడేశాడు. ఈ దారుణ ఘటనకు సంబంధించి పోలీసులు మాజీ గ్రామ ప్రధాన్ సంజయ్ పటేల్, అతని మేనల్లుడు సందీప్ పటేల్ను అరెస్ట్ చేశారు. ఈ హత్యలో పాలుపంచుకున్న మరో నిందితుడు పరారీలో ఉన్నాడు.
ఆగస్టు 13న కిషోర్పురా గ్రామంలోని ఓ రైతు తన పొలానికి వెళ్లినప్పుడు బావి నుంచి తీవ్రమైన దుర్వాసన రావడం గమనించాడు. అనుమానంతో చూడగా, నీటిపై రెండు సంచులు తేలియాడుతూ కనిపించాయి. వాటిలో మహిళ శరీర భాగాలు ఉండటంతో స్థానికులు దిగ్భ్రాంతికి గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
ఈ కేసును ఛేదించేందుకు ఝాన్సీ సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్ఎస్పీ) 8 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. వందలాది సీసీటీవీ కెమెరాల ఫుటేజ్ను పరిశీలించి, 100 మందికి పైగా గ్రామస్థులను విచారించారు. మృతురాలిని గుర్తించేందుకు వేలాది పోస్టర్లు అంటించగా, వాటిలో ఒక పోస్టర్ చూసిన ఒక వ్యక్తి ఆమెను తన సోదరి రచన యాదవ్గా గుర్తించాడు. మధ్యప్రదేశ్లోని తికమ్గఢ్కు చెందిన రచన ఒక వితంతువు అని, ఆమెకు సంజయ్ పటేల్తో కొంతకాలంగా సంబంధం ఉందని తేలింది.
పోలీసుల విచారణలో సంజయ్ తన నేరాన్ని అంగీకరించాడు. రచన నిరంతరం పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేయడంతో విసిగిపోయి, ఆమెను అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపాడు. ఆగస్టు 8న రచనను గొంతు నులిమి హత్య చేసి, సాక్ష్యాలను మాయం చేసేందుకు మృతదేహాన్ని ముక్కలుగా నరికారు. అనంతరం వాటిని సంచుల్లో వేసి బావిలోను, సమీపంలోని వంతెన వద్ద పడేశారు.
"ఈ కేసు దర్యాప్తు కోసం 8 బృందాలను ఏర్పాటు చేశాం. గురువారం లఖేరి నది నుంచి మహిళ తలను స్వాధీనం చేసుకున్నాం" అని ఎస్ఎస్పీ మీడియాకు తెలిపారు. ఈ కేసును విజయవంతంగా ఛేదించిన దర్యాప్తు బృందానికి రూ. 50,000 రివార్డు ప్రకటించారు. పరారీలో ఉన్న నిందితుడు ప్రదీప్ అహిర్వార్ ఆచూకీ తెలిపిన వారికి రూ. 25,000 రివార్డును కూడా ప్రకటించినట్లు ఆయన వెల్లడించారు.
ఆగస్టు 13న కిషోర్పురా గ్రామంలోని ఓ రైతు తన పొలానికి వెళ్లినప్పుడు బావి నుంచి తీవ్రమైన దుర్వాసన రావడం గమనించాడు. అనుమానంతో చూడగా, నీటిపై రెండు సంచులు తేలియాడుతూ కనిపించాయి. వాటిలో మహిళ శరీర భాగాలు ఉండటంతో స్థానికులు దిగ్భ్రాంతికి గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
ఈ కేసును ఛేదించేందుకు ఝాన్సీ సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్ఎస్పీ) 8 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. వందలాది సీసీటీవీ కెమెరాల ఫుటేజ్ను పరిశీలించి, 100 మందికి పైగా గ్రామస్థులను విచారించారు. మృతురాలిని గుర్తించేందుకు వేలాది పోస్టర్లు అంటించగా, వాటిలో ఒక పోస్టర్ చూసిన ఒక వ్యక్తి ఆమెను తన సోదరి రచన యాదవ్గా గుర్తించాడు. మధ్యప్రదేశ్లోని తికమ్గఢ్కు చెందిన రచన ఒక వితంతువు అని, ఆమెకు సంజయ్ పటేల్తో కొంతకాలంగా సంబంధం ఉందని తేలింది.
పోలీసుల విచారణలో సంజయ్ తన నేరాన్ని అంగీకరించాడు. రచన నిరంతరం పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేయడంతో విసిగిపోయి, ఆమెను అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపాడు. ఆగస్టు 8న రచనను గొంతు నులిమి హత్య చేసి, సాక్ష్యాలను మాయం చేసేందుకు మృతదేహాన్ని ముక్కలుగా నరికారు. అనంతరం వాటిని సంచుల్లో వేసి బావిలోను, సమీపంలోని వంతెన వద్ద పడేశారు.
"ఈ కేసు దర్యాప్తు కోసం 8 బృందాలను ఏర్పాటు చేశాం. గురువారం లఖేరి నది నుంచి మహిళ తలను స్వాధీనం చేసుకున్నాం" అని ఎస్ఎస్పీ మీడియాకు తెలిపారు. ఈ కేసును విజయవంతంగా ఛేదించిన దర్యాప్తు బృందానికి రూ. 50,000 రివార్డు ప్రకటించారు. పరారీలో ఉన్న నిందితుడు ప్రదీప్ అహిర్వార్ ఆచూకీ తెలిపిన వారికి రూ. 25,000 రివార్డును కూడా ప్రకటించినట్లు ఆయన వెల్లడించారు.