Jaish-e-Mohammed: పాక్లో జైషే కొత్త ఎత్తుగడ... డిజిటల్ హవాలాతో ఉగ్ర నిధులు!
- ఈజీపైసా, సదాపే వాలెట్లతో ఉగ్ర నిధుల సమీకరణ
- ఎఫ్ఏటీఎఫ్ ఆంక్షలను తప్పించుకునేందుకే కొత్త మార్గం
- మసూద్ అజార్ కుటుంబం నియంత్రణలో వాలెట్లు
- 313 కొత్త శిబిరాల ఏర్పాటు లక్ష్యంగా ఆన్లైన్ చందాలు
- గల్ఫ్ దేశాల నుంచి భారీగా తరలివస్తున్న నిధులు
ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపుతున్నామని ప్రపంచానికి చెబుతున్న పాకిస్థాన్, తెరవెనుక ఉగ్రసంస్థలకు అండగా నిలుస్తున్న తీరు మరోసారి బయటపడింది. అంతర్జాతీయ ఆర్థిక కార్యదళం (ఎఫ్ఏటీఎఫ్) ఆంక్షల నుంచి తప్పించుకునేందుకు, జైషే మహమ్మద్ (జైషే) ఉగ్రవాద సంస్థ 'డిజిటల్ హవాలా' అనే కొత్త మార్గాన్ని ఎంచుకున్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. టెక్నాలజీని వాడుకుంటూ ఆన్లైన్ వేదికగా ఉగ్ర కార్యకలాపాలకు నిధులను సమీకరిస్తున్నట్లు వెల్లడైంది.
పాకిస్థాన్లో సులభంగా అందుబాటులో ఉండే ఈజీపైసా, సదాపే వంటి డిజిటల్ వాలెట్లను ఈ ఉగ్ర ముఠా తమ కార్యకలాపాలకు అస్త్రంగా మార్చుకుంది. జైషే అధినేత మసూద్ అజార్ కుమారుడు అబ్దుల్లా, ఖైబర్ ప్రావిన్స్ కమాండర్ సయ్యద్ సఫ్దార్ పేర్ల మీద ఉన్న ఖాతాలతో పాటు దాదాపు 250 ఇతర వాలెట్లను ఈ డిజిటల్ హవాలా కోసం చురుగ్గా వినియోగిస్తున్నట్లు తెలిసింది. ఈ వాలెట్లకు వస్తున్న నిధుల మూలాలను కప్పిపుచ్చేందుకు, డబ్బును తరచూ వేర్వేరు ఖాతాలకు బదిలీ చేస్తూ అధికారులను తప్పుదోవ పట్టిస్తున్నారు.
ఒకవైపు ఉగ్రవాద నిర్మూలనకు కట్టుబడి ఉన్నామని పాక్ ప్రభుత్వం చెబుతున్నా, గతంలో భారత్ చేపట్టిన 'ఆపరేషన్ సిందూర్'లో ధ్వంసమైన జైషే శిక్షణా కేంద్రాల పునర్నిర్మాణానికి నిధులు సమకూరుస్తున్నట్లు సమాచారం. అంతేకాకుండా, కొత్తగా 313 శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేసే లక్ష్యంతో, ఆన్లైన్ ద్వారా చందాలు సేకరించి ఏకంగా 391 కోట్ల పాకిస్థానీ రూపాయలను సమీకరించాలని జైషే లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నిధులను ఆయుధాలు, కమ్యూనికేషన్ వ్యవస్థలు, విలాసవంతమైన కార్ల కొనుగోలుతో పాటు మసూద్ అజార్ కుటుంబ నిర్వహణకు వాడుతున్నట్లు నిఘా వర్గాలు పేర్కొన్నాయి.
ఈ డిజిటల్ హవాలా నెట్వర్క్కు ప్రధానంగా గల్ఫ్ దేశాల నుంచి నిధులు వెల్లువెత్తుతున్నాయని, జైషే సేకరిస్తున్న మొత్తం నిధుల్లో 80 శాతం ఈ మార్గంలోనే వస్తున్నాయని నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఎఫ్ఏటీఎఫ్ నిబంధనలు పాటిస్తున్నామని పాక్ చెబుతున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో ఉగ్రవాద సంస్థలు టెక్నాలజీని వాడుకుని తమ కార్యకలాపాలను యథేచ్ఛగా కొనసాగిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది.
పాకిస్థాన్లో సులభంగా అందుబాటులో ఉండే ఈజీపైసా, సదాపే వంటి డిజిటల్ వాలెట్లను ఈ ఉగ్ర ముఠా తమ కార్యకలాపాలకు అస్త్రంగా మార్చుకుంది. జైషే అధినేత మసూద్ అజార్ కుమారుడు అబ్దుల్లా, ఖైబర్ ప్రావిన్స్ కమాండర్ సయ్యద్ సఫ్దార్ పేర్ల మీద ఉన్న ఖాతాలతో పాటు దాదాపు 250 ఇతర వాలెట్లను ఈ డిజిటల్ హవాలా కోసం చురుగ్గా వినియోగిస్తున్నట్లు తెలిసింది. ఈ వాలెట్లకు వస్తున్న నిధుల మూలాలను కప్పిపుచ్చేందుకు, డబ్బును తరచూ వేర్వేరు ఖాతాలకు బదిలీ చేస్తూ అధికారులను తప్పుదోవ పట్టిస్తున్నారు.
ఒకవైపు ఉగ్రవాద నిర్మూలనకు కట్టుబడి ఉన్నామని పాక్ ప్రభుత్వం చెబుతున్నా, గతంలో భారత్ చేపట్టిన 'ఆపరేషన్ సిందూర్'లో ధ్వంసమైన జైషే శిక్షణా కేంద్రాల పునర్నిర్మాణానికి నిధులు సమకూరుస్తున్నట్లు సమాచారం. అంతేకాకుండా, కొత్తగా 313 శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేసే లక్ష్యంతో, ఆన్లైన్ ద్వారా చందాలు సేకరించి ఏకంగా 391 కోట్ల పాకిస్థానీ రూపాయలను సమీకరించాలని జైషే లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నిధులను ఆయుధాలు, కమ్యూనికేషన్ వ్యవస్థలు, విలాసవంతమైన కార్ల కొనుగోలుతో పాటు మసూద్ అజార్ కుటుంబ నిర్వహణకు వాడుతున్నట్లు నిఘా వర్గాలు పేర్కొన్నాయి.
ఈ డిజిటల్ హవాలా నెట్వర్క్కు ప్రధానంగా గల్ఫ్ దేశాల నుంచి నిధులు వెల్లువెత్తుతున్నాయని, జైషే సేకరిస్తున్న మొత్తం నిధుల్లో 80 శాతం ఈ మార్గంలోనే వస్తున్నాయని నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఎఫ్ఏటీఎఫ్ నిబంధనలు పాటిస్తున్నామని పాక్ చెబుతున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో ఉగ్రవాద సంస్థలు టెక్నాలజీని వాడుకుని తమ కార్యకలాపాలను యథేచ్ఛగా కొనసాగిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది.