'వ్యూహం' సినీ నిర్మాత దాసరి కిరణ్ హైదరాబాద్లో అరెస్టు
- నిర్మాత దాసరి కిరణ్ను అరెస్ట్ చేసిన విజయవాడ పోలీసులు
- హైదరాబాద్లో అదుపులోకి తీసుకుని విజయవాడకు తరలింపు
- రూ.4.5 కోట్ల ఆర్థిక లావాదేవీల వివాదమే కారణం
- అప్పు చెల్లించమన్న బంధువులపై దాడి చేయించారని ఆరోపణలు
హైదరాబాద్ బంజారాహిల్స్లో ఉంటున్న దాసరి కిరణ్ బంధువు గాజుల మహేశ్ ట్రావెల్ ఏజెన్సీ నిర్వహిస్తున్నారు. రెండేళ్ల క్రితం ఆయన వద్ద దాసరి కిరణ్ రూ.4.5 కోట్లు అప్పుగా తీసుకున్నారు. గడువు ముగిసినా, అనేకసార్లు అడిగినప్పటికీ ఆ డబ్బు తిరిగి చెల్లించకపోవడంతో, బాధితుడు ఆయన్ను నిలదీశారు. ఈ క్రమంలో ఈ నెల 18న మహేశ్, తన భార్యతో కలిసి డబ్బులు అడిగేందుకు విజయవాడలోని కిరణ్ కార్యాలయానికి వెళ్లారు.
అక్కడ దాదాపు 15 మంది తమపై దాడి చేశారని మహేశ్ ఆరోపించారు. కిరణ్ తన అనుచరులతో దాడి చేయించారని ఆరోపిస్తూ బాధితులు విజయవాడ పటమట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అనంతరం, హైదరాబాద్లో ఉన్న దాసరి కిరణ్ను అదుపులోకి తీసుకున్నారు. తదుపరి విచారణ కోసం ఆయన్ను విజయవాడకు తరలించినట్లు పోలీసులు తెలిపారు.