Godavari River: భద్రాచలం వద్ద పోటెత్తుతున్న గోదావరి.. తొలి ప్రమాద హెచ్చరిక జారీ

Godavari River First Warning Issued at Bhadrachalam Due to Flooding
షార్ట్స్‌లో చూడండి
భద్రాచలం వద్ద గోదావరి నది ఉగ్రరూపం దాల్చింది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలు, ఎడతెరిపిలేని వరద ప్రవాహంతో భద్రాచలం వద్ద నీటిమట్టం వేగంగా పెరుగుతోంది. గోదావరి నీటిమట్టం 43 అడుగులకు చేరడంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. నదీ తీర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.

ప్రస్తుతం భద్రాచలం వద్ద గోదావరిలో 9,40,345 క్యూసెక్కుల వరద నీరు ప్రవహిస్తున్నట్టు అధికారులు తెలిపారు. భారీ వరద కారణంగా భద్రాచలంలోని స్నానఘట్టాలు పూర్తిగా నీట మునిగిపోయాయి. వరద నీరు కళ్యాణకట్టను తాకింది. ఈ నేపథ్యంలో భక్తులు స్నానాల కోసం నదిలోకి వెళ్లవద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. మరోవైపు, ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన పర్ణశాలలోనూ వరద ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ఇక్కడి సీతమ్మ నారచీరల ప్రాంతంతో పాటు సీతమ్మ విగ్రహం కూడా వరద నీటిలో మునిగిపోయింది.

మరోవైపు, తుంగభద్ర జలాశయానికి కూడా వరద పోటెత్తింది. ప్రాజెక్టుకు 1,28,453 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా, అధికారులు 26 గేట్లను ఎత్తి 1,30,715 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. గోదావరి, తుంగభద్ర నదులకు వరద ఉద్ధృతి కొనసాగుతుండటంతో అధికారులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. 
Go Back to Shorts
Godavari River
Bhadrachalam
Godavari floods
Telangana floods
Tungabhadra reservoir
Flood alert
Heavy rains
Parnasala
River flooding
Telangana rain

More Telugu News