విమర్శించడం లేదంటూనే రేవంత్పై రాజగోపాల్రెడ్డి ఫైర్
- పదవులు, పైసలు రెండూ మీకేనా? అంటూ రాజగోపాల్రెడ్డి ఆగ్రహం
- బిల్లు రాకపోవడంతో కాంట్రాక్టర్ రోడ్డు పనులు చేయట్లేదన్న మునుగోడు ఎమ్మెల్యే
- తనకు మంత్రి పదవి వస్తే అది ప్రజలకే ఉపయోగమని వ్యాఖ్య
గత 20 నెలలుగా తన నియోజకవర్గం మునుగోడులో రోడ్లు, భవనాలకు ఒక్క రూపాయి కూడా ఇవ్వడం లేదని రాజగోపాల్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తాను మంత్రి వద్దకు వెళ్లి అడిగినా రాలేదని, వందసార్లు తిరిగినా ఫలితం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తంచేశారు. కాబట్టి పదవుల్లోనూ మీరే, పైసలూ మీరే తీసుకుంటున్నారని అడగాలా? వద్దా? అని ప్రశ్నించారు. తనకు మంత్రి పదవి విషయంలో అధిష్ఠానం నిర్ణయం తీసుకుంటుందని, అది వచ్చేటప్పుడు ఎవరు ఆపినా ఆగదని తేల్చి చెప్పారు. తనకు పదవి వస్తే దాని వల్ల ప్రజలకే లాభమని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మంచోళ్లను ఎన్నుకోవాలని, వారితో కలిసి నియోజకవర్గ అభివృద్ధికి నిధుల కోసం పోరాడతానని రాజగోపాల్రెడ్డి పేర్కొన్నారు.