Chandrababu: విజ‌య‌వాడ‌లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.. జాతీయ జెండాను ఆవిష్క‌రించిన సీఎం చంద్ర‌బాబు

Chandrababu Hoists National Flag at Vijayawada Independence Day Celebrations
  
విజ‌య‌వాడ న‌గ‌రంలోని మున్సిప‌ల్ స్టేడియంలో 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘ‌నంగా జ‌రుగుతున్నాయి. సీఎం చంద్ర‌బాబు జాతీయ‌జెండాను ఎగుర‌వేసి పోలీసుల నుంచి గౌర‌వ వంద‌నం స్వీక‌రించారు. ఈ కార్య‌క్ర‌మంలో సీఎస్ విజ‌యానంద్‌, డీజీపీ హ‌రీశ్ కుమార్ గుప్తా, ప్ర‌భుత్వ ఉన్న‌తాధికారులు పాల్గొన్నారు.

స్టేడియానికి విద్యార్థులు, న‌గ‌ర పౌరులు భారీగా త‌ర‌లివ‌చ్చారు. ముఖ్య‌మంత్రి వాహ‌నంపై నుంచి అంద‌రికీ అభివాదం చేస్తూ స్టేడియంలో తిరిగారు. ఈ వేడుక‌ల్లో ప్ర‌ద‌ర్శించిన శ‌క‌టాలు, ప‌రేడ్ ఆక‌ట్టుకున్నాయి. ప‌రేడ్‌లో పాల్గొన్న వివిధ బెటాలియ‌న్ల‌ను సీఎం చంద్ర‌బాబు ప‌రిశీలించారు. 
Chandrababu
Andhra Pradesh
Vijayawada
Independence Day
National Flag Hoisting
79th Independence Day
AP Government
Harish Kumar Gupta
Municipal Stadium Vijayawada

More Telugu News