మోదీ మూడోసారి ప్రధాని అయినప్పుడే మాకు అనుమానాలు వచ్చాయి: జగ్గారెడ్డి
- మోదీ గెలుపుకు దొంగ ఓట్లే కారణమన్న జగ్గారెడ్డి
- ఓట్ల చోరీపై పోరాడుతున్న రాహుల్ కు అందరూ మద్దతు ఇవ్వాలని విన్నపం
- కాంగ్రెస్ పార్టీలో అందరూ దమ్మున్న నేతలే అని వ్యాఖ్య
ఊహించని విధంగా మోదీ మూడోసారి ప్రధాని అయినప్పుడే తమకు అనుమానాలు వచ్చాయని జగ్గారెడ్డి అన్నారు. మారుమూల గ్రామాల్లో దొంగ ఓట్లను నమోదు చేయించి గెలిచేందుకు ప్రణాళికలు వేశారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో అందరూ దమ్మున్నోళ్లమేనని, కోమటిరెడ్డి సోదరులు కూడా దమ్మున్నవాళ్లేనని అన్నారు. మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీ స్క్రిప్ట్ చదవాలి కనుక ఆ పని చేశారని చెప్పారు. ఎన్టీఆర్ కుమార్తె పురందేశ్వరి అయినా బీజేపీ స్క్రిప్ట్ చదవాల్సిందేనని జగ్గారెడ్డి అన్నారు.