బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుంది... అందరి లెక్కలు సరిచేస్తాం: కేటీఆర్
- రేవంత్ పాలన విచిత్రంగా ఉందన్న కేటీఆర్
- రాష్ట్రంలో భూముల విలువ పడిపోయిందని వ్యాఖ్య
- కేసీఆర్ అంటే రేవంత్ భయపడుతున్నారన్న రేవంత్
రుణమాఫీ విషయంలో రేవంత్ ప్రభుత్వం విఫలమయిందని కేటీఆర్ అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత రైతుబంధును ప్రభుత్వం నిలిపివేస్తుందని చెప్పారు. కేసీఆర్ అంటే రేవంత్ రెడ్డికి భయం పట్టుకుందని... అందుకే ఢిల్లీలో కూడా కేసీఆర్ నే విమర్శిస్తున్నారని అన్నారు. బీఆర్ఎస్ పాలనలో జరిగిన మంచి పనులను తమ పార్టీ కార్యకర్తలు ప్రజలకు చెప్పలేకపోయారని... అందుకే ఓడిపోయామని చెప్పారు. కేసీఆర్ ను మళ్లీ సీఎం చేసుకునేందుకు అందరం కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు.