ఏపీ మహిళలకు గుడ్ న్యూస్ చెప్పిన సీఎం చంద్రబాబు
- ఈ నెల 15వ తేదీ నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం
- పథకం ప్రారంభ కార్యక్రమంలో మంత్రులంతా పాల్గొనాలని చంద్రబాబు ఆదేశం
- జగన్ ప్రభుత్వ నిర్వాకంతో సింగపూర్ ప్రభుత్వం భయపడిందన్న చంద్రబాబు
జగన్ ప్రభుత్వ నిర్వాకంతో సింగపూర్ ప్రభుత్వం భయపడిందని చంద్రబాబు అన్నారు. ఏపీపై పోయిన నమ్మకాన్ని పునరుద్ధరించేందుకు ఎంతో కష్టపడాల్సి వచ్చిందని చెప్పారు. పెట్టుబడుల సదస్సుకు వచ్చేందుకు సింగపూర్ ప్రభుత్వం అంత తేలికగా అంగీకరించలేదని తెలిపారు. వైసీపీ హయాంలో సింగపూర్ కు వెళ్లి మరీ అక్కడి మంత్రులను బెదిరించారని మండిపడ్డారు.
మరోవైపు నూతన బార్ పాలసీకి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దీనిపై చంద్రబాబు మాట్లాడుతూ.... కల్లుగీత కార్మికులకు కేటాయించిన బార్లకు బినామీలు వస్తే సహించనని హెచ్చరించారు.