ఏపీ సచివాలయంలో కేబినెట్ భేటీ
––
పర్యాటక శాఖ పరిధిలోని 22 హోటళ్లు, రిసార్టులు, క్లస్టర్ల నిర్వహణ కోసం ఏజెన్సీ ఎంపిక నిర్ణయాధికారాన్ని ఆ శాఖ ఎండీకి కల్పించడంపై ఈ భేటీలో చర్చించనున్నారు. నూతన బార్ లైసెన్స్ పాలసీపై మంత్రివర్గ ఉపసంఘం నివేదికకు ఆమోదం, లిక్కర్ దుకాణాల్లో పర్మిట్ రూముల అనుమతి, సెలూన్లకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్, మీడియా అక్రిడిటేషన్ల కొత్త నిబంధనలు తదితర అంశాలపై కేబినెట్ చర్చించి ఆమోదం తెలపనున్నట్లు అధికార వర్గాల సమాచారం.