Deepak: తల్లి ఖాతాలో కోటీ 13 లక్షల కోట్లు డిపాజిట్.. ఫోన్లో మెసేజ్ చూసి కొడుకు షాక్
- ఉత్తరప్రదేశ్ లోని నోయిడాలో సంచలనంగా మారిన ఉదంతం
- బ్యాంకును ఆశ్రయించిన యువకుడు.. కోటక్ మహేంద్ర బ్యాంకులో ఘటన
- అలాంటి ఘటన ఏమీ జరగలేదంటూ బ్యాంకు అధికారుల వివరణ
ఉత్తరప్రదేశ్ లోని నోయిడాకు చెందిన ఓ యువకుడు రాత్రికి రాత్రే కోటిశ్వరుడయ్యాడు.. బ్యాంకు ఖాతాలో ఒకటీ రెండు కోట్లు కాదు ఏకంగా కోటి కోట్లు వచ్చిపడ్డాయి. రెండు నెలల క్రితం మరణించిన తల్లి గాయత్రీ దేవి బ్యాంకు ఖాతాలో ఈ మొత్తం జమ అయినట్లు ఫోన్ కు మెసేజ్ రావడంతో షాక్ కు గురయ్యాడు. మెసేజ్ లో పేర్కొన్న అంకెలను లెక్కబెట్టడం తనవల్ల కాక స్నేహితుల సాయం కోరాడు. తల్లి ఖాతాలో రూ.10,01,35,60,00,00,00,00,00,01,00,23,56,00,00,00,00,299. జమ అయినట్లు వచ్చిన మెసేజ్ ను చూపించాడు. నోయిడాకు చెందిన దీపక్ (20) అనే కుర్రాడికి ఎదురైందీ అనుభవం.
ఉదయం ఆ మెసేజ్ చూసిన దీపక్ వెంటనే డాంకౌర్ పరిధిలోని బ్యాంకుకు పరుగు తీశాడు. షాక్కు గురైన బ్యాంకు అధికారులు వెంటనే ఆ ఖాతాను స్తంభింపజేశారని ప్రచారం జరుగుతోంది. ఈ వార్తలపై కోటక్ మహీంద్ర బ్యాంకు అధికారులు స్పందించారు. యువకుడి తల్లి ఖాతాలో కోటి కోట్లు జమ అయినట్లు జరుగుతున్న ప్రచారం అంతా అవాస్తవమని వివరణ ఇచ్చారు. అలాంటి సంఘటన ఏదీ తమ బ్యాంకులో చోటుచేసుకోలేదని వారు స్పష్టం చేశారు.
ఉదయం ఆ మెసేజ్ చూసిన దీపక్ వెంటనే డాంకౌర్ పరిధిలోని బ్యాంకుకు పరుగు తీశాడు. షాక్కు గురైన బ్యాంకు అధికారులు వెంటనే ఆ ఖాతాను స్తంభింపజేశారని ప్రచారం జరుగుతోంది. ఈ వార్తలపై కోటక్ మహీంద్ర బ్యాంకు అధికారులు స్పందించారు. యువకుడి తల్లి ఖాతాలో కోటి కోట్లు జమ అయినట్లు జరుగుతున్న ప్రచారం అంతా అవాస్తవమని వివరణ ఇచ్చారు. అలాంటి సంఘటన ఏదీ తమ బ్యాంకులో చోటుచేసుకోలేదని వారు స్పష్టం చేశారు.