జమ్మూకశ్మీర్ లో బయటపడ్డ 8వ శతాబ్దం నాటి దేవతా విగ్రహాలు
- కర్కోట రాజుల కాలం నాటివని భావిస్తున్న శాస్త్రవేత్తలు
- అనంత్ నాగ్ జిల్లాలోని కర్కూట్ నాగ్ లో పురాతత్వ శాఖ తవ్వకాలు
- బయటపడ్డ శివ లింగాలు, ఇతర విగ్రహాలు
ప్రస్తుతం విగ్రహాలు దొరికిన చోటులో అప్పట్లో బహుశా ధర్మగుండం ఉండొచ్చని పురాతత్వశాఖ అధికారులు అభిప్రాయపడుతున్నారు. బయటపడ్డ విగ్రహాలను మ్యూజియానికి తరలించి భద్రపరుస్తామని అధికారులు చెబుతున్నారు. అయితే, కర్కోట రాజుల కాలంలో పూజారులుగా వ్యవహరించిన కశ్మీరీ పండిట్ల వారసులు మాత్రం ఈ విగ్రహాలను జాగ్రత్త చేసి ఇదేచోట ఆలయం నిర్మించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.