Jagan: జగన్ పర్యటనలో తొక్కిసలాట.. కానిస్టేబుల్ మాలకొండయ్యకు గాయాలు
- నేడు నెల్లూరు వచ్చిన జగన్
- నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డికి పరామర్శ
- జగన్ రాకతో ఒక్కసారిగా తోసుకువచ్చిన కార్యకర్తలు
వైసీపీ అధినేత జగన్ ఇవాళ నెల్లూరు పర్యటనకు రావడం తెలిసిందే. ఆయన వైసీపీ మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డిని పరామర్శించేందుకు వెళ్లే క్రమంలో భారీ తోపులాట జరిగింది. ఈ ఘటనలో మాలకొండయ్య అనే కానిస్టేబుల్ గాయపడ్డారు. ఆయనకు చేయి విరిగినట్టు తెలిసిందే. దాంతో ఆయనను ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో ఓ సీఐ కూడా కిందపడిపోయారు.
జగన్... ప్రసన్నకుమార్ రెడ్డి ఇంటికి వెళుతున్న సమయంలో వైసీపీ కార్యకర్తలు ఒక్కసారిగా మెయిన్ రోడ్డుపైకి చేరుకున్నారు. పోలీసులు బారికేడ్లు పెట్టినా, ప్రయోజనం లేకపోయింది. వైసీపీ కార్యకర్తలు అలాగే ముందుకు తోసుకురావడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనపై ఏపీ హోంమంత్రి అనిత్ ఇప్పటికే ఆరా తీశారు. శాంతిభద్రతలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
జగన్... ప్రసన్నకుమార్ రెడ్డి ఇంటికి వెళుతున్న సమయంలో వైసీపీ కార్యకర్తలు ఒక్కసారిగా మెయిన్ రోడ్డుపైకి చేరుకున్నారు. పోలీసులు బారికేడ్లు పెట్టినా, ప్రయోజనం లేకపోయింది. వైసీపీ కార్యకర్తలు అలాగే ముందుకు తోసుకురావడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనపై ఏపీ హోంమంత్రి అనిత్ ఇప్పటికే ఆరా తీశారు. శాంతిభద్రతలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.