Chandrababu Naidu: చంద్రబాబు ఏపీకి బయల్దేరుతున్నారని తెలిసి హోటల్ కు భారీగా తరలి వచ్చిన తెలుగు ప్రజలు... ఫొటోలు ఇవిగో!
- సింగపూర్ లో నాలుగు రోజుల పాటు సాగిన చంద్రబాబు పర్యటన
- చివరి రోజు ఘనంగా వీడ్కోలు పలికిన తెలుగు ప్రజలు
- ఈ రాత్రికి ఉండవల్లి చేరుకోనున్న సీఎం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తన నాలుగు రోజుల సింగపూర్ పర్యటనను విజయవంతంగా ముగించుకుని రాష్ట్రానికి బయల్దేరారు. పర్యటన చివరి రోజున ఆయనకు సింగపూర్లోని తెలుగు ప్రజలు ఘనంగా వీడ్కోలు పలికారు.
నాలుగు రోజుల పాటు సాగిన ఈ పర్యటనలో ముఖ్యమంత్రి 26 సమావేశాలు, కార్యక్రమాలలో పాల్గొన్నారు. రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన కీలక చర్చలు, ఒప్పందాలు ఈ పర్యటనలో భాగంగా జరిగాయి.
ముఖ్యమంత్రి పర్యటన ముగించుకుని ఏపీకి బయల్దేరుతున్నారని తెలిసిన వెంటనే, సింగపూర్లోని తెలుగు ప్రజలు ఆయన బస చేసిన హోటల్కు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. వీడ్కోలు పలికే సమయంలో "జై సీబీఎన్" అంటూ నినాదాలతో తమ అభిమానాన్ని చాటుకున్నారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సింగపూర్లోని తెలుగు ప్రజల అభిమానానికి ధన్యవాదాలు తెలిపారు. సింగపూర్లోని తెలుగు ప్రజలు చూపిన ఆత్మీయ స్వాగతం, ప్రేమాభిమానాలను తాను మరువలేనని ఆయన వ్యాఖ్యానించారు.
ముఖ్యమంత్రి రాత్రి 10:30 గంటలకు హైదరాబాద్లోని శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి వెంటనే విజయవాడకు బయల్దేరి, రాత్రి 11:30 గంటలకు ఉండవల్లిలోని తన నివాసానికి చేరుకుంటారని అధికార వర్గాలు తెలిపాయి.










నాలుగు రోజుల పాటు సాగిన ఈ పర్యటనలో ముఖ్యమంత్రి 26 సమావేశాలు, కార్యక్రమాలలో పాల్గొన్నారు. రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన కీలక చర్చలు, ఒప్పందాలు ఈ పర్యటనలో భాగంగా జరిగాయి.
ముఖ్యమంత్రి పర్యటన ముగించుకుని ఏపీకి బయల్దేరుతున్నారని తెలిసిన వెంటనే, సింగపూర్లోని తెలుగు ప్రజలు ఆయన బస చేసిన హోటల్కు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. వీడ్కోలు పలికే సమయంలో "జై సీబీఎన్" అంటూ నినాదాలతో తమ అభిమానాన్ని చాటుకున్నారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సింగపూర్లోని తెలుగు ప్రజల అభిమానానికి ధన్యవాదాలు తెలిపారు. సింగపూర్లోని తెలుగు ప్రజలు చూపిన ఆత్మీయ స్వాగతం, ప్రేమాభిమానాలను తాను మరువలేనని ఆయన వ్యాఖ్యానించారు.
ముఖ్యమంత్రి రాత్రి 10:30 గంటలకు హైదరాబాద్లోని శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి వెంటనే విజయవాడకు బయల్దేరి, రాత్రి 11:30 గంటలకు ఉండవల్లిలోని తన నివాసానికి చేరుకుంటారని అధికార వర్గాలు తెలిపాయి.









