భారత్, పాక్ సెమీస్ పోరుపై నీలినీడలు.. తప్పుకున్న స్పాన్సర్..!
- రేపు భారత్, పాక్ సెమీస్ పోరు
- ఈ మ్యాచ్ స్పాన్సర్షిప్ నుంచి తప్పుకున్న ఈజ్మైట్రిప్
- సోషల్ మీడియా వేదికగా ప్రకటించిన సంస్థ సహ యజమాని నిశాంత్ పిట్టి
ఆ కంపెనీ సహా యజమాని నిశాంత్ పిట్టి ఎక్స్ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించారు. ఉగ్రవాదం, క్రికెట్ ఎప్పటికీ కలిసి నడవలేవు. మాకు దేశమే ముఖ్యం. ఆ తర్వాతే వ్యాపారమని ఆయన ట్వీట్ చేశారు. "ఉగ్రవాదం, క్రికెట్ ఎప్పటికీ కలిసి ముందుకు సాగలేవు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే దేశంతో సంబంధాలను పునరుద్దరించడానికి ప్రయత్నించే ఏ ఈవెంట్కు మేం మద్దతు ఇవ్వలేము. మా మొదటి ప్రాధాన్యం దేశం. ఆ తర్వాతే వ్యాపారం" అని నిశాంత్ పిట్టి తన ట్వీట్లో పేర్కొన్నారు.
ఇక, లీగ్ దశలో పాకిస్థాన్తో ఆడేందుకు ఇండియా ఛాంపియన్స్ నిరాకరించిన విషయం తెలిసిందే. పహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ ఘటనల నేపథ్యంలో దాయాదితో ఆడలేమని ఆటగాళ్లు మ్యాచ్ను బాయ్కాట్ చేశారు. దాంతో ఈ మ్యాచ్ను టోర్నీ నిర్వాహకులు రద్దు చేశారు. సెమీస్లో మరోసారి ఈ రెండు జట్లు తలపడాల్సి రావడంతో ఇప్పుడు ఏం చేస్తారనే ప్రశ్న తలెత్తుతుంది. తాజాగా స్పాన్సర్ కూడా తప్పుకోవడంతో నిర్వాహకులు సెమీస్ పోరును మారుస్తారా? లేక పాకిస్థాన్ను ఫైనల్ చేర్చుతారా? అనే ఉత్కంఠ నెలకొంది.