రేపు పాకిస్థాన్తో సెమీస్.. భారత్ ఆడుతుందా..?
- డబ్ల్యూసీఎల్లో విండీస్ను చిత్తుచేసి సెమీస్కు చేరిన భారత్
- రేపు పాకిస్థాన్తో సెమీస్ పోరు
- లీగ్ స్టేజీలో దాయాది మ్యాచ్ను బాయ్కాట్ చేసిన టీమిండియా
- ఇప్పుడు సెమీస్లో కూడా ఆడకుంటే ఫైనల్కు పాక్
రేపు పాక్తో సెమీస్ పోరు..
ఇక, సెమీస్కు దూసుకెళ్లిన భారత్ రేపు ఇంగ్లండ్లోని ఎడ్జ్బాస్టన్లో సాయంత్రం ఐదు గంటలకు (భారత కాలమానం ప్రకారం) పాకిస్థాన్తో తలపడాల్సి ఉంది. లీగ్ దశలో భారత ఆటగాళ్లు బాయ్కాట్ చేయడంతో టోర్నీ మేనేజ్మెంట్ పాక్తో మ్యాచ్ను రద్దు చేసి చెరో పాయింగ్ కేటాయించింది. ఇప్పుడు సెమీఫైనల్ మ్యాచ్నూ ఇండియా ఛాంపియన్స్ బాయ్కాట్ చేస్తే పాక్ ఫైనల్కు వెళ్లే అవకాశముంది. దీంతో రేపు దాయాదితో భారత్ ఆడుతుందా లేదా అనేది తెలియాల్సి ఉంది.