ఆపరేషన్ సిందూర్ పై శశిథరూర్ బాటలోనే మరో కాంగ్రెస్ ఎంపీ
- లోక్ సభలో చర్చ సందర్భంగా మౌనం వీడని ఎంపీ మనీశ్ తివారి
- పార్టీ గళం వినిపించలేదేమన్న ప్రశ్నకు దేశభక్తి గీతంతో జవాబు
- ‘ఎక్స్’ ఖాతాలో దేశభక్తి గీతం పంచుకున్న మనీశ్ తివారి
తాజాగా శశిథరూర్ బాటలోనే మరో ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి మనీశ్ తివారి కూడా ఆపరేషన్ సిందూర్ పై జరిగిన చర్చలో పాల్గొనలేదు. ఈ విషయంపై పార్లమెంట్ ఆవరణలో మీడియా సంధించిన ప్రశ్నలకు కూడా తివారి స్పందించలేదు. అయితే, తన మౌనానికి కారణం ఏంటనేది ‘ఎక్స్’ ద్వారా వెల్లడించారు. తాజాగా ఆయన తన ‘ఎక్స్’ ఖాతాలో దేశభక్తి గీతాన్ని పోస్ట్ చేశారు. భారతీయుడిగా భారత దేశ కీర్తిని చాటుతానని, దేశం కోసమే మాట్లాడతాననే అర్థం వచ్చేలా పోస్ట్ పెట్టారు. ఆపరేషన్ సిందూర్ విషయంలో కేంద్రాన్ని ప్రశ్నించేందుకు సుముఖంగా లేనని పరోక్షంగా వెల్లడించారు. ఈ కారణంతోనే మనోజ్ తివారిని కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ చర్చలో పాల్గొనకుండా చేసిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.