పార్టీ విలీనం కోసం సీఎం రమేశ్ ఇంటికి వెళ్లారో లేదో కేటీఆర్ చెప్పాలి: ఆది శ్రీనివాస్
- కేటీఆర్, సీఎం రమేశ్ మధ్య మాటల యుద్ధం
- స్పందించిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
- కేటీఆర్ కు ప్రశ్నాస్త్రాలు సంధించిన కాంగ్రెస్ నేత
"కవితపై ఉన్న కేసులు ఎత్తివేస్తే బీజేపీలో బీఆర్ఎస్ ను విలీనం చేస్తామని చెప్పారా, లేదా? బీఆర్ఎస్ ఓ అవినీతి పార్టీ అని, ఆ పార్టీని కలుపుకునేది లేదని బీజేపీ హైకమాండ్ చెప్పింది నిజం కాదా? పలు సామాజిక వర్గాలపై మీరు తీవ్ర వ్యాఖ్యలు చేయలేదా? ఈ వ్యవహారాన్ని పక్కదారి పట్టించకుండా దమ్ముంటే సీఎం రమేశ్ అడిగిన వాటికి కేటీఆర్ సమాధానం చెప్పాలి" అని ఆది శ్రీనివాస్ స్పష్టం చేశారు.