Operation Sindoor: స్కూలు పిల్లల పాఠ్యాంశంగా ‘ఆపరేషన్ సిందూర్’
- పాఠ్య పుస్తకాలలో చేర్చనున్న ఎన్ సీఈఆర్టీ
- ప్రత్యేక మాడ్యూల్ ను సిద్ధం చేస్తున్న అధికారులు
- విద్యార్థులలో దేశభక్తిని పెంపొందించడమే ఉద్దేశం
జమ్మూకశ్మీర్ లోని పహల్గామ్ లో ఉగ్రదాడి అనంతరం భారత సైన్యం ‘ఆపరేషన్ సిందూర్’ చేపట్టిన విషయం తెలిసిందే. సరిహద్దులతోపాటు పాకిస్థాన్ లోని ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేయడమే లక్ష్యంగా సైన్యం ఈ ఆపరేషన్ చేపట్టింది. అర్ధరాత్రి పూట 23 నిమిషాల పాటు జరిగిన ఈ ఆపరేషన్ లో మొత్తం తొమ్మిది ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసినట్లు సైన్యం ప్రకటించింది. ఈ ఆపరేషన్ వివరాలను స్కూలు పిల్లలకు పాఠ్యాంశంగా బోధించాలని కేంద్రం నిర్ణయించింది. దీనిపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గతంలోనే ప్రకటన చేశారు.
తాజాగా ఈ విషయంపై నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎన్ సీఈఆర్టీ) స్పందించింది. విద్యార్థుల్లో దేశభక్తిని పెంపొందించే ఉద్దేశంతో ఆపరేషన్ సిందూర్ ను సిలబస్ లో చేర్చుతున్నట్లు తెలిపింది. పిల్లలకు జాతీయ భద్రత, సైనిక వ్యూహం, దౌత్యం ప్రాముఖ్యతను బోధించడమే ఈ నిర్ణయం వెనకున్న లక్ష్యమని తెలిపింది.
ఇందుకోసం ఎన్ సీఈఆర్టీ ప్రత్యేక మాడ్యూల్ను సిద్ధం చేస్తోంది. ఈ మాడ్యూల్ను రెండు భాగాలుగా విభజిస్తారు. ఒకటి 3- 8 తరగతుల విద్యార్థుల కోసం, మరొకటి 9 నుండి 12 తరగతుల విద్యార్థుల కోసం రూపొందిస్తారు. ఆదిత్య ఎల్1, చంద్రయాన్ అంతరిక్ష మిషన్లు, ఇటీవల శుభాన్షు శుక్లా 'అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్)'కు వెళ్లిన అంశాలను కొత్త సిలబస్లో చేర్చనున్నట్లు అధికారులు తెలిపారు.
తాజాగా ఈ విషయంపై నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎన్ సీఈఆర్టీ) స్పందించింది. విద్యార్థుల్లో దేశభక్తిని పెంపొందించే ఉద్దేశంతో ఆపరేషన్ సిందూర్ ను సిలబస్ లో చేర్చుతున్నట్లు తెలిపింది. పిల్లలకు జాతీయ భద్రత, సైనిక వ్యూహం, దౌత్యం ప్రాముఖ్యతను బోధించడమే ఈ నిర్ణయం వెనకున్న లక్ష్యమని తెలిపింది.
ఇందుకోసం ఎన్ సీఈఆర్టీ ప్రత్యేక మాడ్యూల్ను సిద్ధం చేస్తోంది. ఈ మాడ్యూల్ను రెండు భాగాలుగా విభజిస్తారు. ఒకటి 3- 8 తరగతుల విద్యార్థుల కోసం, మరొకటి 9 నుండి 12 తరగతుల విద్యార్థుల కోసం రూపొందిస్తారు. ఆదిత్య ఎల్1, చంద్రయాన్ అంతరిక్ష మిషన్లు, ఇటీవల శుభాన్షు శుక్లా 'అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్)'కు వెళ్లిన అంశాలను కొత్త సిలబస్లో చేర్చనున్నట్లు అధికారులు తెలిపారు.