Chandrababu Naidu: కర్నూలు జిల్లాలో డ్రోన్ నుంచి క్షిపణి పరీక్ష విజయవంతంపై చంద్రబాబు హర్షం

Chandrababu Naidu lauds successful missile test in Kurnool
  • కర్నూలులోని ఎన్ఓఏఆర్‌లో డ్రోన్‌తో క్షిపణి పరీక్ష
  • శాస్త్రవేత్తలు, అవిష్కర్తలకు అభినందనలు తెలిపిన సీఎం చంద్రబాబు
  • ఎక్స్ వేదికగా రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ట్వీట్ కు స్పందించిన చంద్రబాబు
కర్నూలులోని టెస్టింగ్ రేంజ్‌లో డీఆర్‌డీఓ డ్రోన్ ద్వారా క్షిపణిని విజయవంతంగా ప్రయోగించడంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. మన దేశ రక్షణ పర్యావరణ వ్యవస్థ వృద్ధికి దోహదపడటం ఆంధ్రప్రదేశ్‌కు గర్వకారణమని చంద్రబాబు అన్నారు.

ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు నేషనల్ ఓపెన్ ఏరియా రేంజ్ (ఎన్ఓఏఆర్)లో యూఏవీ-లాంచ్డ్ ప్రెసిషన్ గైడెడ్ క్షిపణి (యూఎల్‌పీజీఎం-V3) పరీక్షను విజయవంతం చేసిన శాస్త్రవేత్తలు, ఆవిష్కర్తలకు సీఎం ఈ సందర్భంగా అభినందనలు తెలిపారు. మన దేశ రక్షణ సామర్థ్యాలను బలోపేతం చేయడంలో ఇది ఒక ముఖ్యమైన ముందడుగు అని పేర్కొన్నారు.

యూఎల్‌పీజీఎం-వీ3 విజయం ఆత్మ నిర్భర్ భారత్ యొక్క నిజమైన స్ఫూర్తిని ప్రతిబింబిస్తోందని ఆయన అన్నారు. రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చేసిన ట్వీట్‌ను చంద్రబాబు రీట్వీట్ చేశారు. 
Chandrababu Naidu
Andhra Pradesh
Kurnool
DRDO
Missile test
ULPGM V3
Defense Research
Rajnath Singh
India defense

More Telugu News