బలహీనమైన పాస్ వర్డ్ వల్ల 158 ఏళ్ల కంపెనీ మూత.. 700 మంది ఉద్యోగులు రోడ్డుపైకి..
- ఒక్క దెబ్బకు కంపెనీ క్లోజ్.. వీక్ పాస్ వర్డ్ కారణంగా సైబర్ అటాక్
- కంపెనీ సిస్టంలోకి చొరబడిన సైబర్ నేరస్థులు
- భారీ మొత్తంలో డబ్బులు ముట్టజెప్పాలని డిమాండ్
- అంత ఇచ్చుకోలేక మూతపడనున్న కంపెనీ
కంపెనీకి చెందిన 500 లారీలు నిత్యం కస్టమర్ల సరుకులను దేశవిదేశాలకు చేరవేస్తుంటాయి. ‘నైట్ ఆఫ్ ఓల్డ్ బ్రాండ్’ పేరుతో ఈ లారీలు తిరుగుతుంటాయి. అయితే, ఇటీవల కంపెనీ ఉద్యోగులలో ఒకరి పాస్ వర్డ్ ను ఊహించిన హ్యాకర్లు.. కేఎన్ పీ సిస్టంలోకి ఎంటరయ్యారు. సంస్థ ఉద్యోగులకు పలు కీలక సమాచారం పొందేందుకు వీలు లేకుండా చేశారని కేఎన్ పీ డైరెక్టర్ పాల్ అబాట్ వివరించారు.
హ్యాకర్లు భారీ మొత్తంలో డబ్బు డిమాండ్ చేస్తున్నారని, అంత మొత్తం ఇచ్చుకునే పరిస్థితి లేదన్నారు. దీంతో తమ ముందు ఉన్న ఏకైక ఆప్షన్ కంపెనీని మూసేయడమేనని చెప్పారు. అయితే, హ్యాకర్లు ఎంత డిమాండ్ చేశారనేది పాల్ అబాట్ వెల్లడించలేదు. సైబర్ నిపుణుల అంచనాల ప్రకారం.. ఈ హ్యకింగ్ అకీరా గ్యాంగ్ పనే అయి ఉంటుందని, 50 లక్షల పౌండ్స్ డిమాండ్ చేసి ఉంటారని అంచనా. కాగా, ఈ సైబర్ అటాక్ కారణంగా కంపెనీ మూతపడితే సంస్థలోని 700 మంది ఉద్యోగులు ఉపాధి కోల్పోనున్నారు.