ఓడిపోతే బాగుండేది... ఇంట్లో కూర్చునేవాడిని: మల్లారెడ్డి అసహనం
- మేడ్చల్ నియోజకవర్గానికి మంత్రిగా ఎంతో చేశానన్న మల్లారెడ్డి
- తనకు కనీస గౌరవం కూడా దక్కడం లేదని ఆవేదన
- అధికారులు ప్రొటోకాల్ పాటించడం లేదని విమర్శ
ఈటల రాజేందర్ మాట్లాడుతూ... బడి, గుడి అనే తేడా లేకుండా ఎక్కడపడితే అక్కడ మద్యం, గంజాయిని విక్రయిస్తున్నారని మండిపడ్డారు. దీని కారణంగా యువత పెడధోరణి పడుతున్నారని చెప్పారు. ప్రొహిబిషన్ శాఖ ప్రమోషన్ శాఖగా మారిందని విమర్శించారు. ఇప్పటికైనా ఎక్సైజ్ అధికారులు చర్యలు చేపట్టాలని అన్నారు. అధికారులు చేసే పనుల ద్వారా వ్యవస్థపై ప్రజలకు విశ్వాసం కల్పించాలని అన్నారు. కేంద్ర, రాష్ట్ర పథకాలు అనే వ్యత్యాసం చూపకుండా ప్రజలకు లబ్ధి కలిగేలా చూడాలని సూచించారు.