ఆపరేషన్ సిందూర్ దెబ్బ... రెండు నెలలుగా ఎయిర్పోర్టు మూసివేత
- రెండు నెలలు గడుస్తున్నా తెరుచుకోని రహీమ్ యార్ ఖాన్ ఎయిర్బేస్
- వరుసగా మూడోసారి నోటమ్ జారీ చేసిన పాకిస్థాన్
- ఆగస్ట్ 5 వరకు రన్ వే మూసి ఉంటుందని వెల్లడి
అయితే మూసివేతకు గల కారణాలను మాత్రం వెల్లడించలేదు. ఆపరేషన్ సిందూర్లో భాగంగా మే 10న భారత్ దాడి చేసిన నేపథ్యంలో తొలి నోటమ్ జారీ అయింది. దాంతో పంజాబ్ ప్రావిన్సులో ఉన్న ఈ వ్యూహాత్మక ఎయిర్బేస్ ఒక వారం పాటు అందుబాటులో ఉండదని ప్రకటించింది. ఆ తర్వాత గత నెల నాలుగో తేదీన రెండో నోటమ్ జారీ చేసింది. మూసివేతను జులై 4 వరకు పొడిగించింది. తాజాగా ఆగస్టు 5వ తేదీ వరకు పొడిగించింది.