జగన్ విషం చిమ్ముతున్నారు: పార్థసారథి
- తమిళనాడులో రాష్ట్ర ప్రయోజనాల కోసం అన్ని పార్టీలు కలిసి పని చేస్తాయన్న పార్థసారథి
- ఏపీలో స్వార్థపూరిత ప్రతిపక్షం ఉందని విమర్శ
- జగన్ బాధ్యత గల నాయకుడిగా వ్యవహరించాలని హితవు
అబద్ధాలే పునాదిగా పబ్బం గడుపుకునేందుకు జగన్ యత్నిస్తున్నారని పార్థసారథి విమర్శించారు. గత టీడీపీ ప్రభుత్వంలో పోలవరం 70 శాతం పూర్తయినప్పటికీ... జగన్ ప్రభుత్వం ఆ ప్రాజెక్టును పూర్తి చేయలేకపోయిందని అన్నారు. జగన్ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. బాధ్యత గల రాజకీయ నాయకుడిగా జగన్ వ్యవహరించాలని హితవు పలికారు.