Perni Nani: పేర్ని నాని పిటిషన్ తోసిపుచ్చిన ఏపీ హైకోర్టు
- ఇటీవల పామర్రులో పేర్ని నాని వ్యాఖ్యలు
- రప్పా రప్పా అంటూ రెచ్చగొట్టేలా మాట్లాడారంటూ టీడీపీ నేతల ఫిర్యాదు
- హైకోర్టును ఆశ్రయించిన పేర్ని నాని
- తదుపరి విచారణ జులై 22కి వాయిదా
మాజీ మంత్రి, వైసీపీ నేత పేర్ని నానికి తీవ్ర నిరాశ ఎదురైంది. కృష్ణా జిల్లా పామర్రు పీఎస్ లో తనపై నమోదైన కేసులో అరెస్ట్ నుంచి రక్షణ కల్పించాలంటూ పేర్ని నాని దాఖలు చేసిన పిటిషన్ ను ఏపీ హైకోర్టు తిరస్కరించింది.
జులై 8న పామర్రులోని ఓ కల్యాణ మండపంలో జరిగిన వైసీపీ కార్యక్రమంలో పేర్ని నాని రప్పా రప్పా అంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారంటూ టీడీపీ నేతలు సీఐకి ఫిర్యాదు చేశారు. ఈ కేసులోనే పేర్ని నాని హైకోర్టును ఆశ్రయించారు. తనపై తొందరపాటు చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. అయితే ఉన్నత న్యాయస్థానంలో ఆయనకు చుక్కెదురైంది. ఈ పిటిషన్ పై తదుపరి విచారణను హైకోర్టు ఈ నెల 22కి వాయిదా వేసింది.
జులై 8న పామర్రులోని ఓ కల్యాణ మండపంలో జరిగిన వైసీపీ కార్యక్రమంలో పేర్ని నాని రప్పా రప్పా అంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారంటూ టీడీపీ నేతలు సీఐకి ఫిర్యాదు చేశారు. ఈ కేసులోనే పేర్ని నాని హైకోర్టును ఆశ్రయించారు. తనపై తొందరపాటు చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. అయితే ఉన్నత న్యాయస్థానంలో ఆయనకు చుక్కెదురైంది. ఈ పిటిషన్ పై తదుపరి విచారణను హైకోర్టు ఈ నెల 22కి వాయిదా వేసింది.