Miss Golf: బౌద్ధ సన్యాసులకు వలపు వల.. ప్రైవేట్ వీడియోలతో రూ.102 కోట్లు కొల్లగొట్టిన యువతి
- థాయ్లాండ్లో ఘటన
- 9 మంది సన్యాసులతో సంబంధాలు ఏర్పరచుకున్న యువతి
- ఫొటోలతో బ్లాక్మెయిల్ చేసి డబ్బులు వసూలు చేసిన యువతి
థాయ్లాండ్లో ఓ యువతి బౌద్ధ సన్యాసులతో లైంగిక సంబంధాలు ఏర్పరచుకొని, వారితో సన్నిహితంగా ఉన్న సమయంలో ఫొటోలు, వీడియోలు తీసింది. వాటితో వారిని బ్లాక్మెయిల్ చేసి మూడేళ్లలో వారి నుంచి రూ. 102 కోట్లు వసూలు చేసింది. తొమ్మిది మంది సన్యాసులను ప్రలోభపెట్టిన ఆ మహిళకు పోలీసులు 'మిస్ గోల్ఫ్' అని పేరు పెట్టారు.
ఆమె ఇంటిని సోదా చేసిన పోలీసులకు దిగ్భ్రాంతికర విషయాలు తెలిశాయి. ఆ సన్యాసులను బ్లాక్మెయిల్ చేయడానికి ఉపయోగించిన 80,000 కంటే ఎక్కువ ఫొటోలు, వీడియోలను గుర్తించారు. ఇటీవల థాయ్లాండ్లో సన్యాసులు లైంగిక, మాదక ద్రవ్యాల అక్రమ రవాణాల్లో పాల్గొంటున్నారనే విమర్శలు అధికమయ్యాయి. ఇప్పుడు ఈ ఘటన అక్కడి బౌద్ధ సంస్థను మరింతగా కుదిపేసింది.
జూన్ నెలలో ఒకరు సన్యాసానికి దూరమయ్యారు. దీంతో పోలీసులు ఈ అంశంపై దృష్టి సారించారు. 2024 మేలో మిస్ గోల్ఫ్ ఒక సన్యాసితో సంబంధం ఏర్పరుచుకుంది. వారికి ఒక బిడ్డ కూడా జన్మించినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత ఖర్చుల కోసం రూ. 1.81 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేసింది. ఫొటోలు, వీడియోలతో బ్లాక్మెయిల్ చేసింది.
ఈ విషయంపై పోలీసులు దర్యాప్తు చేయగా, మరికొందరు సన్యాసులతోనూ ఆమె ఇలాగే వ్యవహరించినట్లు వెల్లడైంది. వారి నుంచి తీసుకున్న డబ్బులో కొంత భాగాన్ని జూదానికి ఉపయోగించిందని పోలీసులు గుర్తించారు. ఇప్పుడు ఆమెపై పోలీసులు మనీలాండరింగ్, దోపిడీ తదితర కేసులు నమోదు చేశారు. ఈ ఘటనపై థాయ్ బౌద్ధానికి సంబంధించిన పాలక సంస్థ సంఘ సుప్రీం కౌన్సిల్ తీవ్రంగా స్పందించింది. సన్యాసుల విషయంలో ఉన్న నియమ నిబంధనలను సమీక్షిస్తామని తెలిపింది.
ఆమె ఇంటిని సోదా చేసిన పోలీసులకు దిగ్భ్రాంతికర విషయాలు తెలిశాయి. ఆ సన్యాసులను బ్లాక్మెయిల్ చేయడానికి ఉపయోగించిన 80,000 కంటే ఎక్కువ ఫొటోలు, వీడియోలను గుర్తించారు. ఇటీవల థాయ్లాండ్లో సన్యాసులు లైంగిక, మాదక ద్రవ్యాల అక్రమ రవాణాల్లో పాల్గొంటున్నారనే విమర్శలు అధికమయ్యాయి. ఇప్పుడు ఈ ఘటన అక్కడి బౌద్ధ సంస్థను మరింతగా కుదిపేసింది.
జూన్ నెలలో ఒకరు సన్యాసానికి దూరమయ్యారు. దీంతో పోలీసులు ఈ అంశంపై దృష్టి సారించారు. 2024 మేలో మిస్ గోల్ఫ్ ఒక సన్యాసితో సంబంధం ఏర్పరుచుకుంది. వారికి ఒక బిడ్డ కూడా జన్మించినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత ఖర్చుల కోసం రూ. 1.81 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేసింది. ఫొటోలు, వీడియోలతో బ్లాక్మెయిల్ చేసింది.
ఈ విషయంపై పోలీసులు దర్యాప్తు చేయగా, మరికొందరు సన్యాసులతోనూ ఆమె ఇలాగే వ్యవహరించినట్లు వెల్లడైంది. వారి నుంచి తీసుకున్న డబ్బులో కొంత భాగాన్ని జూదానికి ఉపయోగించిందని పోలీసులు గుర్తించారు. ఇప్పుడు ఆమెపై పోలీసులు మనీలాండరింగ్, దోపిడీ తదితర కేసులు నమోదు చేశారు. ఈ ఘటనపై థాయ్ బౌద్ధానికి సంబంధించిన పాలక సంస్థ సంఘ సుప్రీం కౌన్సిల్ తీవ్రంగా స్పందించింది. సన్యాసుల విషయంలో ఉన్న నియమ నిబంధనలను సమీక్షిస్తామని తెలిపింది.