Uttam Kumar Reddy: కేసులు కొట్టివేయాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పిటిషన్.. హైకోర్టులో విచారణ!

Uttam Kumar Reddy Petition to Quash Cases Hearing in High Court
  • ఎన్నికల సమయంలో ఉత్తమ్ కుమార్ రెడ్డిపై కేసులు
  • నేరేడుచర్ల, మఠంపల్లి పోలీస్ స్టేషన్‌లలో కేసులు
  • కేసులు కొట్టివేయాలని మూడు వేర్వేరు పిటిషన్లు దాఖలు చేసిన మంత్రి
  • తదుపరి విచారణను ఈ నెల 18కి వాయిదా వేసిన హైకోర్టు
తనపై నమోదైన కేసులను కొట్టివేయాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టులో విచారణ జరిగింది. ఎన్నికల సమయంలో ఆయనపై వివిధ పోలీస్ స్టేషన్‌లలో కేసులు నమోదయ్యాయి.

నేరేడుచర్ల, మఠంపల్లి పోలీస్ స్టేషన్‌లలో నమోదైన కేసులను కొట్టివేయాలని కోరుతూ మంత్రి మూడు వేర్వేరు పిటిషన్లను దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై జస్టిస్ కె. లక్ష్మణ్ విచారణ చేపట్టారు. అనంతరం తదుపరి విచారణను ఈ నెల 18వ తేదీకి వాయిదా వేశారు.
Uttam Kumar Reddy
Uttam Kumar Reddy cases
Telangana Minister
High Court

More Telugu News