Malu Bhatti Vikramarka: మల్లు భట్టివిక్రమార్కకు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లీగల్ నోటీసులు

Malu Bhatti Vikramarka Receives Legal Notice From Telangana BJP President
  • రోహిత్ వేముల ఆత్మహత్య అంశంపై రామచందర్ రావుపై ఆరోపణలు
  • తనకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని బీజేపీ అధ్యక్షుడి డిమాండ్
  • లేదంటే రూ. 25 కోట్లకు పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరిక
తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్కకు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు లీగల్ నోటీసులు పంపించారు. రోహిత్ వేముల ఆత్మహత్య అంశంపై భట్టివిక్రమార్క చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఆయన తరపు న్యాయవాది విజయ్‌కాంత్‌ ద్వారా ఈ నోటీసులు పంపించారు.

తనపై నిరాధార ఆరోపణలు చేసినందుకు మల్లు భట్టివిక్రమార్క మూడు రోజుల్లో బేషరతుగా క్షమాపణ చెప్పాలని ఆ నోటీసుల్లో డిమాండ్ చేశారు. అలా చేయని పక్షంలో రూ. 25 కోట్లకు పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు. క్షమాపణ చెప్పని పక్షంలో క్రిమినల్ కేసులు ఎదుర్కోవాల్సి ఉంటుందని కూడా పేర్కొన్నారు.
Malu Bhatti Vikramarka
Telangana
Telangana BJP
N Ramachander Rao
Rohit Vemula

More Telugu News