ర్యాంకర్లను సన్మానించిన ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్
- జాతీయ స్థాయిలో తెలుగు విద్యార్థుల సత్తా
- ఉండవల్లి నివాసంలో విద్యార్థులను కలిసిన మంత్రి నారా లోకేశ్
- రాష్ట్రానికి గర్వకారణంలా నిలిచారని అభినందనలు
ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ఆధ్వర్యంలో ఉండవల్లిలోని తన నివాసంలో ఈ విద్యార్థులను కలిసిన మంత్రి నారా లోకేశ్, వారి ప్రతిభకు ముగ్ధులైనట్లు తెలిపారు. "తమ కృషి, పట్టుదలతో జాతీయ స్థాయిలో ఉత్తమ ర్యాంకులు సాధించిన ఈ విద్యార్థులు రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచారు" అని సోషల్ మీడియా వేదికగా ప్రశంసించారు. ఈ సందర్భంగా విద్యార్థుల సాధనను కొనియాడిన మంత్రి, రాష్ట్రంలోని ఇతర విద్యార్థులకు వారు స్ఫూర్తిగా నిలవాలని ఆకాంక్షించారు.



