నాగర్ కర్నూల్ జిల్లాలో కాంగ్రెస్ నేత హత్య.. అక్రమ సంబంధమే కారణం!
- రెండు రోజులుగా అదృశ్యం.. సింగోటం రిజర్వాయర్ లో మృతదేహం
- కల్వకోల్ గ్రామంలోని ఓ మహిళతో వివాహేతర సంబంధం
- రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని మహిళ భర్త, కొడుకు దాడి
దామోదర్ గౌడ్ కు అదే గ్రామానికి చెందిన ఓ మహిళతో వివాహేతర సంబంధం ఉంది. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి సదరు మహిళతో గడిపేందుకు వెళ్లాడు. దామోదర్ గౌడ్ ఆ మహిళతో సన్నిహితంగా ఉండగా.. సదరు మహిళ భర్త, కొడుకు గమనించారు. ఆగ్రహం పట్టలేక ఇద్దరిపైనా దాడి చేసి దామోదర్ గౌడ్ ను కొట్టి చంపారు. ఆ తర్వాత శవాన్ని సంచిలో మూటకట్టి తీసుకెళ్లి ఎంజీకేఎల్ కెనాల్ లో పడేశారు. రెండు రోజుల తర్వాత దామోదర్ గౌడ్ మృతదేహం సింగోటం రిజర్వాయర్ లో తేలింది. ప్రస్తుతం ఆ మహిళను, ఆమె భర్త, కుమారుడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.