Sai Krishna: కొన్ని రోజుల్లో పెళ్లి... రోడ్డు ప్రమాదంలో బావామరదలు మృతి
- త్వరలో పెళ్లి చేసుకోవాల్సిఉన్న బావమరదలు సాయికృష్ణ, అనిత
- బావామరదలు ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న లారీ
- అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు మండలం బాలపల్లె వద్ద ఘటన
అన్నమయ్య జిల్లా, రైల్వే కోడూరు మండలంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. కొద్ది రోజుల్లో వివాహం జరగనున్న బావామరదలు రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఈ దుర్ఘటన మండలంలోని బాలపల్లె వద్ద జరిగింది. సాయికృష్ణ (29), అనిత (21) అనే బావామరదళ్లు త్వరలో వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.
నిన్న వారు ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో బావ, మరదలు ఇద్దరూ మృతి చెందారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం రైల్వే కోడూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఈ ఘటనతో రెండు కుటుంబాల్లో విషాదం నెలకొంది. త్వరలో పెళ్లి పీటలెక్కాల్సిన ఇద్దరు రోడ్డు ప్రమాదంలో మరణించడంతో అందరూ దిగ్భ్రాంతికి గురయ్యారు.
నిన్న వారు ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో బావ, మరదలు ఇద్దరూ మృతి చెందారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం రైల్వే కోడూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఈ ఘటనతో రెండు కుటుంబాల్లో విషాదం నెలకొంది. త్వరలో పెళ్లి పీటలెక్కాల్సిన ఇద్దరు రోడ్డు ప్రమాదంలో మరణించడంతో అందరూ దిగ్భ్రాంతికి గురయ్యారు.