సరిగ్గా 100 పరుగులు చేసి అవుటైన కేఎల్ రాహుల్
- లార్డ్స్ లో భారత్, ఇంగ్లండ్ మూడో టెస్టు
- తొలి ఇన్నింగ్స్ కొనసాగిస్తున్న టీమిండియా
- మొదటి ఇన్నింగ్స్ లో 387 పరుగులు చేసిన ఇంగ్లండ్
ఈ టెస్టులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆతిథ్య జట్టు తొలి ఇన్నింగ్స్ లో 387 పరుగులకు ఆలౌట్ అయిన సంగతి తెలిసిందే. టీమిండియా తొలి ఇన్నింగ్స్ విషయానికొస్తే... ఓపెనర్ యశస్వి జైస్వాల్ 13, కరుణ్ నాయర్ 40, కెప్టెన్ శుభ్ మాన్ గిల్ 16, రిషబ్ పంత్ 74 పరుగులు చేశారు. సెంచరీ హీరో కేఎల్ రాహుల్ 177 బంతుల్లో 13 ఫోర్లతో 100 పరుగులు చేసి అవుటయ్యాడు. పంత్ 112 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సులతో 74 పరుగులు చేసి లంచ్ కు ముందు రనౌట్ రూపంలో వెనుదిరిగాడు.
ఇంగ్లండ్ బౌలర్లలో క్రిస్ వోక్స్ 1, ఆర్చర్ 1, కెప్టెన్ బెన్ స్టోక్స్ 1, షోయబ్ బషీర్ 1 వికెట్ తీశారు.