Vijayasai Reddy: సిట్ విచారణకు డుమ్మా కొట్టిన విజయసాయిరెడ్డి
- లిక్కర్ స్కామ్ కేసులో నేడు విచారణకు హాజరుకావాల్సిన విజయసాయి
- ముందుగా నిర్ణయించుకున్న కార్యక్రమాలు ఉన్నాయంటూ సిట్ కు సమాచారం పంపిన వైనం
- విచారణకు వచ్చే తేదీని తెలియజేస్తానన్న విజయసాయి
ఏపీ లిక్కర్ స్కామ్ కేసు విచారణకు మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి డుమ్మా కొట్టారు. ఈ ఉదయం 10 గంటలకు సిట్ ముందు విచారణకు విజయసాయి హాజరుకావాల్సి ఉంది. అయితే, ఈరోజు విచారణకు తాను హాజరుకాలేనని సిట్ అధికారులకు విజయసాయి సమాచారం అందించారు. తనకు ముందుగా నిర్ణయించుకున్న కార్యక్రమాలు ఉన్నందువల్ల విచారణకు హాజరుకాలేకపోతున్నానని... విచారణకు వచ్చే తేదీని తెలియజేస్తానని చెప్పారు.
ఈ కేసుకు సంబంధించి ఏప్రిల్ 18న విజయసాయి తొలిసారి సిట్ విచారణకు హాజరయ్యారు. ఆ సందర్భంగా కుంభకోణంలో కీలక సూత్రధారులు, పాత్రధారుల పేర్లను ఆయన వెల్లడించారు. ఇప్పటి వరకు ఈ కేసులో మొత్తం 11 మందిని సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. వీరంతా ప్రస్తుతం రిమాండ్ లో ఉన్నారు.
మరోవైపు, ఈ ఉదయం విజయసాయి చేసిన ట్వీట్ వైరల్ గా మారింది. ఎవరైతే కర్మను చేస్తారో వారు అనుభవించక తప్పదు అనేవిధంగా భగవద్గీత శ్లోకాన్ని ఆయన పోస్ట్ చేశారు.
ఈ కేసుకు సంబంధించి ఏప్రిల్ 18న విజయసాయి తొలిసారి సిట్ విచారణకు హాజరయ్యారు. ఆ సందర్భంగా కుంభకోణంలో కీలక సూత్రధారులు, పాత్రధారుల పేర్లను ఆయన వెల్లడించారు. ఇప్పటి వరకు ఈ కేసులో మొత్తం 11 మందిని సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. వీరంతా ప్రస్తుతం రిమాండ్ లో ఉన్నారు.
మరోవైపు, ఈ ఉదయం విజయసాయి చేసిన ట్వీట్ వైరల్ గా మారింది. ఎవరైతే కర్మను చేస్తారో వారు అనుభవించక తప్పదు అనేవిధంగా భగవద్గీత శ్లోకాన్ని ఆయన పోస్ట్ చేశారు.