కర్నూలు జిల్లాలో ఘోర ప్రమాదం.. చిన్నారితో పాటు ముగ్గురి మృతి
- ఓర్వకల్లు వద్ద ట్రాక్టర్ను ఢీకొన్న స్కార్పియో
- ఒకే కుటుంబంలో ముగ్గురు దుర్మరణం
- మరో ఆరుగురికి తీవ్ర గాయాలు, ఆసుపత్రిలో చికిత్స
- హైదరాబాద్ నుంచి కడప వెళ్తుండగా జరిగిన దుర్ఘటన
దీంతో స్కార్పియోలోని ప్రయాణికులలో మున్ని (35), షేక్ కమాల్ బాషా (50) అక్కడికక్కడే దుర్మరణం చెందారు. తీవ్రంగా గాయపడిన మూడేళ్ల చిన్నారి షేక్ నదియాను కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ కన్నుమూసింది. ఈ ప్రమాదంలో గాయపడ్డ మరో ఆరుగురిని పోలీసులు స్థానిక ఆసుపత్రిలో చేర్పించారు. వీరిలో ఓ మహిళ పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.