Shibu Thomas: హెల్మెట్ ధరించి బస్సు నడుపుతున్న కేరళ బస్ డ్రైవర్.. వీడియో ఇదిగో!
- సోషల్ మీడియాలో వైరల్ అయిన డ్రైవర్ షిబు థామస్ వీడియో
- సమ్మెలో పాల్గొంటే జీతాలు కట్ చేస్తామని ప్రభుత్వ హెచ్చరిక
- ప్రభుత్వ ఆదేశాలను పట్టించుకోకుండా సమ్మెకు దిగిన కార్మిక సంఘాలు
- కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్త బంద్
దేశవ్యాప్త సమ్మె నేపథ్యంలో కేరళలో ఒక వింత దృశ్యం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఆందోళనకారుల దాడుల నుంచి తనను తాను కాపాడుకునేందుకు కేరళ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (కేఎస్ఆర్టీసీ)కు చెందిన ఒక డ్రైవర్ హెల్మెట్ ధరించి బస్సు నడపడం చర్చనీయాంశంగా మారింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో సమ్మె ఉద్రిక్తత ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది.
కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా కార్మిక సంఘాలు ఈరోజు దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చాయి. ఈ క్రమంలో పతనంతిట్ట నుంచి కొల్లాం మార్గంలో బస్సు నడుపుతున్న షిబు థామస్ అనే డ్రైవర్ ముందుజాగ్రత్త చర్యగా హెల్మెట్ ధరించి విధులకు హాజరయ్యారు. బస్సులోని కండక్టర్ ఈ దృశ్యాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది క్షణాల్లో వైరల్గా మారింది. సమ్మె సమయంలో హింసాత్మక ఘటనలు జరగవచ్చన్న భయంతోనే డ్రైవర్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
మరోవైపు, సమ్మెపై కేరళ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. బస్సులు యథావిధిగా నడుస్తాయని రవాణా శాఖ మంత్రి కేబీ గణేశ్ కుమార్ ప్రకటించారు. సమ్మెలో పాల్గొనే ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులపై 'డైస్ నాన్' (జీతం రహిత దినం) నిబంధన వర్తిస్తుందని, ఆ రోజు జీతం, ఇతర సర్వీసు ప్రయోజనాలు కోల్పోతారని ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. అనధికారిక సెలవులను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబోమని స్పష్టం చేసింది.
అయితే, ప్రభుత్వ హెచ్చరికలను సీఐటీయూ, ఐఎన్టీయూసీ వంటి ప్రధాన కార్మిక సంఘాలు తోసిపుచ్చాయి. కేఎస్ఆర్టీసీ కార్మికులు కూడా సమ్మెలో పాల్గొంటారని తేల్చిచెప్పాయి. దీంతో రాష్ట్రంలో ప్రభుత్వ వైఖరి, కార్మిక సంఘాల పట్టుదల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా కార్మిక సంఘాలు ఈరోజు దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చాయి. ఈ క్రమంలో పతనంతిట్ట నుంచి కొల్లాం మార్గంలో బస్సు నడుపుతున్న షిబు థామస్ అనే డ్రైవర్ ముందుజాగ్రత్త చర్యగా హెల్మెట్ ధరించి విధులకు హాజరయ్యారు. బస్సులోని కండక్టర్ ఈ దృశ్యాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది క్షణాల్లో వైరల్గా మారింది. సమ్మె సమయంలో హింసాత్మక ఘటనలు జరగవచ్చన్న భయంతోనే డ్రైవర్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
మరోవైపు, సమ్మెపై కేరళ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. బస్సులు యథావిధిగా నడుస్తాయని రవాణా శాఖ మంత్రి కేబీ గణేశ్ కుమార్ ప్రకటించారు. సమ్మెలో పాల్గొనే ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులపై 'డైస్ నాన్' (జీతం రహిత దినం) నిబంధన వర్తిస్తుందని, ఆ రోజు జీతం, ఇతర సర్వీసు ప్రయోజనాలు కోల్పోతారని ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. అనధికారిక సెలవులను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబోమని స్పష్టం చేసింది.
అయితే, ప్రభుత్వ హెచ్చరికలను సీఐటీయూ, ఐఎన్టీయూసీ వంటి ప్రధాన కార్మిక సంఘాలు తోసిపుచ్చాయి. కేఎస్ఆర్టీసీ కార్మికులు కూడా సమ్మెలో పాల్గొంటారని తేల్చిచెప్పాయి. దీంతో రాష్ట్రంలో ప్రభుత్వ వైఖరి, కార్మిక సంఘాల పట్టుదల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది.